ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని దేశ చరిత్రలో కీలక ఘట్టానికి ఏపీ వేదికవుతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఎసఆరఎం యూనివర్సిటీ, మేధా టవర్స్లో రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమవుతున్న క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో సాంకేతిక శకంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. విజన్ నుంచి క్యూబిట్స్ వరకు `ఆంధ్రప్రదేశ్ భారత్ క్వాంటమ్ భవిష్యత్ను నిర్మిస్తోందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేయడం ఇందులో భాగమే.
గన్నవరంలోని మేధా టవర్స్తోపాటు రాజధానిలోని ఎసఆరఎం యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటవుతున్న 1ఎస్, 1క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి దక్కుతుంది. మేధాటవర్స్లో క్యూబిటెక్ సంస్థ, ఎసఆరఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు `క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో కీలకం. ఈ రెండుచోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందిస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతోపాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎసఆరఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్సు ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది.
స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్సు ఫెసిలిటీ
అమరావతిలో ఏర్పాటు చేస్తున్న రెండు క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశీ ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్లో క్వూబిటెక్ సంస్థ 1క్యూ పేరిట క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేసింది. ఎసఆరఎం యూనివర్సిటీలో 1ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటమ్ టెస్ట్ బెడ్ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓలాంటి సంస్థల సహకారం ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ల ప్రారంభోత్సవానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరవుతారు.
తయారీ రంగంలో ముందడుగు:
అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు, రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్లను, విడిభాగాల్ని అక్కడే తయారుచేసి ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. గత ఏడాది సెప్టెంబరు 9న హార్డ్వేర్ విడిభాగాల తయారీదారులతో ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో క్వాంటమ్ విడిభాగాల టెస్టింగ్, వ్యాలిడేషన్, బెంచ్మార్కింగ్, సర్టిఫికేషన్ కోసం రిఫరెన్స్ సదుపాయాలు కావాలని కోరారు. అమరావతిలో రిఫరెన్స్ ఫెసిలిటీస్ను కల్పించాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. ఈ సదుపాయాలు రావడంతో అమరావతిలోనే క్వాంటమ్ పరికరాలు తయారు చేసేందుకు దేశంలోని పలు సంస్థలు ముందుకొచ్చే అవకాశముంది. మన దేశంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు క్వాంటమ్ విడిభాగాలు తయారు చేస్తున్నా, ప్రాసెసర్ల వంటివాటిని టెస్టింగ్ కోసం విదేశాలకు పంపాల్సి వస్తోంది. అమరావతి రిఫరెన్స్ ఫెసిలిటీస్తో క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ రంగంలో భారత్ పెద్ద ముందడుగు వేయనుంది.
క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకే కాదు..
అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ కోసం తయారు చేసిన క్రయోజెనిక్స్, ప్రిసిషన్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పరికరాలు, సదుపాయాలు కేవలం క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకే కాకుండా, రక్షణ, ఆరోగ్య, సెమీకండక్టర్ తయారీవంటి రంగాలకూ ఉపయోగపడతాయన్నది నిపుణులు చెబుతోన్న మాట. క్రయోజెనిక్ సిస్టమ్స్ను ఎంఆరఐ మెషీన్లు, స్పేస్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సెన్సింగ్, రాడార్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్కు ఉపయోగపడుతుంది. క్వాంటమ్గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాలను సెమీకండక్టర్ల తయారీ, డీప్టెక్ ఇండస్ట్రియల్ అప్లికేషన్లలో వినియోగిస్తారు.
క్వాంటమ్ కంప్యూటర్తో రాష్ట్రానికి కొత్త కళ రానుంది. ఇదే ఊపుతో.. అమరావతిలో వచ్చే డిసెంబరులోగా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుతోపాటు.. క్వాంటమ్, ఏఐ టెక్నాలజీల పరిశోధనలు, అల్గారిథమ్స్, యూజ్ కేసుల రూపకల్పనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో “క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర” పనులు మొదలయ్యాయి. వచ్చే మూడేళ్లలో 100 క్వాంటమ్-ఏఐ అల్గారిథమ్స్, యూజ్ కేసులు అభివృద్ధి చేయడం, 5 వేలమంది విద్యార్థుల్ని క్వాంటమ్ అల్గారిథమ్స్ రాయడంలో నిపుణులుగా తీర్చిదిద్దడం, క్వాంటమ్ టెక్నాలజీపై 600 మందికిపైగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, 100 స్టార్టప్లు ప్రారంభమయ్యేలా చూడటం, 100 పత్రాల ప్రచురణ, వందకుపైగా పేటెంట్ల సాధన, 50కి పైగా పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని లక్ష్యాలుగా పెట్టుకుంది.
అమరావతి క్వాంటమ్వ్యాలీ మిషన్ డైరెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే గవర్నింగ్ కౌన్సిల్లో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల ప్రొఫెసర్లు, ఐబీఎం సంస్థ ప్రతినిధులు, రాష్ట్రంలోని 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్నుంచి నలుగురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం గన్నవరంలోని మేధాటవర్స్ నుంచి నడిచే క్వాంటమ్ ఇనోవేషన్ సెంటర్ అమరావతిలో భవన నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నుంచి పని చేస్తుంది.
నిమిషాల లెక్కన ఛార్జీ వసూలు
ఐబీఎంవంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్లు వినియోగించుకున్నందుకు నిమిషాల లెక్కన ఛార్జీ వసూలు చేస్తాయి. ప్రస్తుతం ఒకేసారి 5,400 నిమిషాల సమయం కొనుగోలు చేస్తే ఐబీఎం నిమిషానికి 48 డాలర్లు వసూలు చేస్తోంది. ఏడాదిలోగా ఆ సమయాన్ని వాడేసుకోవాలి. 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇలా తక్కువ సమయం కావాలనుకున్న వారి నుంచి నిమిషానికి 96 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది. ఇలా నిమిషాల లెక్కన కేటాయించే సమయాన్నే క్వాంటమ్ క్రెడిట్స్ అంటారు.
గంట చొప్పున ఉచితంగా వాడుకునేందుకు:
అమరావతిలో ఏర్పాటు చేసే 133 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ క్వాంటమ్ కంప్యూటర్కూ ఐబీఎం ఇవే ధరల్ని నిర్ణయించే అవకాశముంది. అమరావతిలోని క్వాంటమ్ కంప్యూటర్ను రోజుకు గంట చొప్పున ఉచితంగా వాడుకునేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం అవకాశమివ్వాలన్నది ఒప్పందంలో భాగం. ఐబీఎం ఉచితంగా ఇచ్చే క్వాంటమ్ క్రెడిట్స్ను “క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర” రూపొందించిన అల్గారిథమ్స్ను రన్ చేయడం, యూజ్ కేసులు సిద్ధం చేయడానికి వాడతారు.
క్వాంటమ్ క్రెడిట్స్ కొనుగోలు:
ఐబీఎం ఉచితంగా ఇచ్చే సమయాన్ని వినియోగించుకుంటూ, ఇంకా అవసరమైతే క్వాంటమ్ క్రెడిట్స్ను కొంటారు. కేవలం క్వాంటమ్ కంప్యూటర్ను తెచ్చి అమరావతిలో పెట్టేస్తే ప్రయోజనం ఉండదని, దాన్ని వాడగలిగేలా అధ్యాపకులు, విద్యార్థుల్ని సిద్ధంచేయాల్సి ఉంటుందని, అధికారుల చెప్తున్నారు. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేనాటికి కనీసం 25 అల్గారిథమ్స్తో సిద్ధంగా ఉండాలన్నది లక్ష్యంగా ఉంది.
108 అంబులెన్స్లకు యూజ్కేస్:
వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా, మెటీరియల్ సైన్స్, ఆర్థిక రంగాలకు 100 క్వాంటమ్-ఏఐ అల్గారిథమ్స్, యూజ్ కేసులు సిద్ధం చేయబోతున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలు, పరిశ్రమల సమస్యలకు అల్గారిథమ్ రాసి క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా పరిష్కారం కనుగొనడాన్నే యూజ్ కేస్ అంటారు. 108 అంబులెన్స్ వాహనాలను, ఏ ప్రాంతాల్లో మోహరిస్తే ప్రజలకు మరింత వేగంగా, మెరుగ్గా సేవలందించవచ్చో ఒక యూజ్ కేస్ తయారు చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కోరింది. గడచిన మూడేళ్లలో 108 కాల్సెంటర్కు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఫోన్ వచ్చాక సగటున ఎంత సేపట్లో అంబులెన్స్ ఆ ప్రాంతానికి చేరుతోంది, ఆలోగా బెడ్లు, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా? వంటి వివరాలన్నీ తీసుకుని ఇన్నోవేషన్ సెంటర్ యూజ్ కేసు తయారు చేస్తుంది.
“కేవలం క్వాంటమ్ కంప్యూటర్ను తెచ్చి అమరావతిలో పెట్టేస్తే గనక ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాన్ని వాడుకుని మనం లబ్ధి పొందేందుకు అవసరమైన ఎకో సిస్టం, సామర్థ్యాలనూ అభివృద్ధి పరిచాలి. అధ్యాపకుల్ని, విద్యార్థుల్ని సిద్ధం చేయాలి. ప్రపంచంలో ఎక్కడ క్వాంటమ్ సేవలు అవసరమైనప్పటికీ మనమే అందించే స్థాయికి ఎదగాలి” అన్నది అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ చెబుతోన్న మాట.
క్వాంటం ఏఐ ఇనోవేషన్ సెంటర్లో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలలకు చెందిన ఎంపిక చేసిన అధ్యాపకులు, స్టార్టప్ కంపెనీలు, రాష్ట్రంలోని 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్నుంచి కొందరిని భాగస్వాముల్ని చేస్తున్నారు. ప్రొఫెసర్లకు క్వాంటమ్ క్రెడిట్స్ ప్రొవైడ్ చేయడంతోపాటు, టెక్నాలజీల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఆయా యూనివర్సిటీలు, కళాశాలల్లో క్వాంటమ్ ల్యాబ్ల ఏర్పాటుకు సహకరిస్తారు. ప్రొఫెసర్ల ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చి, వారు స్టార్టప్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తారు. మొత్తంగా క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించి పూర్తి ఎకో సిస్టంను రాష్ట్రంలో నెలకొల్పే అత్యద్భుత ప్రయత్నం మహాయజ్ఞంగా సాగుతోంది.















