- సత్ఫలితాలు ఇచ్చిన లోకేష్ పర్యటన
- ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
- సమ్మిళిత విద్య, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యం
- లోకేష్, ఆస్ట్రేలియా మంత్రి సమక్షంలో ఎంవోయూలు
- అనంతరం సీఎంను కలిసిన ప్రతినిధి బృందం
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియా భాగస్వా మ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. క్లీన్ ఎనర్జీ, అడ్వా మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో భారత్-ఆస్ట్రేలి యా సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆస్ట్రేలియా లోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో ఏపీ ప్రభుత్వం నాలుగు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చు కుంది. శనివారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
లోకేష్ ఆస్ట్రేలియా టూర్ తో సత్ఫలితాలు
మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించారు. అక్కడి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతి నిధులతో జరిపారు. ఏపీకి రావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఆహ్వానం పలికారు. ఏపీలో అవకాశాలు, ఇస్తున్న రాయితీలను వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. లోకేష్ ప్రతిపాదనల కు ఆస్ట్రేలియా ప్రతినిధులు అప్పుడే సానుకూలంగా స్పందించా రు. నేడు ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయూలు కుదుర్చుకున్నా రు. లోకేష్ ఆస్ట్రేలియా టూర్ వల్లే ఇది సాధ్యమైంది.
ఐఐటీ తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ కలిసి ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్న ఏర్పాటు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ను సోలార్ తయారీ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం గా పెట్టుకున్నారు. ప్రతిపాదిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అధునా తన సోలార్ పీవీ తయారీ, సోలార్ ప్యానెళ్ల రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన పరి శోధనలు, అధ్యాపకుల సామర్థ్య అభివృద్ధి, ప్రత్యేక శిక్షణా కార్యక్ర మాలపై దృష్టి సారించనున్నారు. సోలార్ ఫోటోవోల్టాయిక్ తయా రీ, సర్క్యులారిటీ రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీయేతర విద్య, శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం, అభివృ ద్ధి చేయడం, అమలు చేయడంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తన సహకారాన్ని అందించనుంది. సోలార్ సెల్ డివైజ్ ఫిజిక్స్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, క్యారెక్టరైజేషన్, రిలయ బిలిటీ ఇంజనీరింగ్, రీసైక్లింగ్, భద్రత, నిర్వహణ, ఇన్ గాట్ తయారీ, వాఫరింగ్ సాంకేతికతలు వంటి అంశాలపై కరిక్యులమ్, లెర్నింగ్ మెటీరియల్స్, అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్, ట్రైనింగ్ కంటెంట్ను రూపొందించనుంది. సమ్మిళత విద్య బలోపేతం కోసం
యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మరో ఎంవోయూ చేసుకున్నాయి. ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ భాగ స్వామ్యం ప్రధాన లక్ష్యం. స్పెషల్ ఎడ్యుకేటర్స్కు ప్రత్యేక శిక్షణ, సాధారణ ఉపాధ్యాయులకు శాస్త్రీయ ఆధారిత శిక్షణ, ఆంద్ర -ప్రదేశ్ విద్యార్థుల అవసరాలకు అనుగుణమైన బోధనా వనరుల రూపకల్పన చేపట్టనున్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం పైలట్ ప్రాజెక్ట్
మూడో ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థ ల్లో సాంకేతిక ఆధారిత విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటునందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ వేదిక ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సమాచార వనరులు, వెల్నెస్ అసెస్మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను పొందగలుగుతారు. పైలట్ కార్యక్రమంలో పాల్గొనే విద్యాసంస్థలకు ఉచితంగా అమలు చేయనున్నారు.
వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధికి డీఎల్ఎస్తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జా తీయ ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణ మైన శిక్షణా కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని అందించడానికి 4వ ఎంవోయూ జరిగింది. ఉపాధి అవకాశాలను మెరుగుపరచ డం, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అందించడం, విద్యాసంస్థలు – పరిశ్ర మల మధ్య బలమైన అనుసంధానం ఏర్పరచడం ఈ భాగస్వా మ్యం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
సీఎం చంద్రబాబును కలిసిన బృందం
ఎంవోయూలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సహా ఇతర ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసు కుంది. ఈ సందర్భంగా దేశం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ని, ఏపీలో గల విస్తృత అవకాశాలను సీఎం వారికి వివరించారు. అనంతరం జూలియన్ హిల్ను శాలువాతో సత్కరించి అరకు కాఫీని, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఎండీ గణేష్కుమార్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.ఉమా, చెన్నైలో ఆస్ట్రే లియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ, సహాయ కార్యదర్శి డామియన్ ఒలివర్, మంత్రి సలహాదారు జార్జ్ థివియోస్, హోమ్ అఫైర్స్ రీజనల్ డైరెక్టర్ స్టీవెన్ స్టీవెన్ బిడిల్, ప్రథమ కార్యదర్శి అలిసన్ మస్ గ్రోవ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ లీసా జాంబర్లాన్, రీబౌండ్ వ్యవస్థాపకులు టాడ్ కింగ్, డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ మేనే జర్ మ్యాక్సిమిలియన్ మెక్ కలఫ్ పాల్గొన్నారు.















