- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరిన మంత్రి నారా లోకేష్
- వివిధ ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి
ఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణనకు సహకరించాలని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో న్యూఢల్లీిలో సోమవారం మంత్రి లోకేష్ సమావేశమై పలు ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి వివరించారు. మంగళగిరిలో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కొన్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని లోకేష్ కోరారు. దీనికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.
అంతే కాకుండా రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటుచేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు వీవర్ స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో AVGC-XR, WAVEX ఫ్రేమ్వర్క్ కింద InnoXR యానిమేషన్, AR/VR, Immersive Technologies కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఇండియా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు ఉన్నారు.















