- వచ్చే ఏడాది కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులు
- కేంద్రంనుంచి రానున్న మరో 1,050 ລ້
- పుష్కరాలకు గోదావరి జిల్లాల్లో ముందుగా ఛార్జింగ్ స్టేషన్లు
- ఏపీఎస్ ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్దేశం
అమరావతి (చైతన్య రథం): ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై కొత్తగాప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అధికారు లను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టంచేశారు. అలాగే, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను.
ముందుగా ఏర్పాటు చేయాలని… వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవా లని సూచించారు. ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ-బస్సుల రోడ్మ్యాప్పై సచివాలయంలో మంగళవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిం వారు. వచ్చే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్లకన్నా ఎక్కువ కాలపరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు.
పర్యావరణహితంగా ప్రజారవాణా
రాష్ట్రంలో పర్యావరణహితమైన ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈవీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2030నాటికి దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను మాత్రమే నిర్వహించాలన్నారు. దీంతో కాలుష్యం తగ్గడమేకాకుండా సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. అలాగే ఈ బస్సుల మెయింటెనెన్స్ ప్రయివేట్ ఆపరేటర్లకు అప్పగించాలన్నారు. స్వయంసమృద్ధి సాధించేలా…. రైల్వేశాఖ తరహాలో ఏపీఎస్ ఆర్టీసీ కార్గో రవాణాపై మరింత దృష్టి పెట్టాలన్నారు. అన్ని బస్ స్టేషన్లకు వాణిజ్యపరంగా మరింత ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలన్నారు. మరోవైపు పీఎం -ఈ బస్ సేవా పథకం కింద 750 ఈ-బస్సులు రాష్ట్రానికి అందిస్తోందని, అలాగే తిరుమల-తిరుపతికి మరో 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. థింక్ గ్యాస్ సంస్థ భాగస్వామ్యంతో చిత్తూరు-నెల్లూరు మార్గంలో నడిపే డీజిల్ బస్సులను సీఎన్జీగా మార్చే పైలట్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు చెప్పారు.














