- అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్పై దృష్టిపెట్టండి
- గూగుల్ సీఈవోతో భేటీలో మంత్రి లోకేష్ ప్రతిపాదన
- ఏఐ డేటా సెంటర్తో వస్తున్నందుకు ధన్యవాదాలు
- ప్రాజెక్టు పనుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ` చైతన్యరథం): గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం, అమలుకాలంపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ… భారత్లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతోపాటు ‘‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్’’ ద్వారా స్టార్టప్లకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్డీఐగా పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్తో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు ‘‘వింగ్స్’’ తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకుపైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. సమావేశంలో బికాష్ కోలే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్ సిఈఓ గూగుల్ క్లౌడ్ పాల్గొన్నారు.














