- ఐదు పేర్లతో కేంద్రానికి జాబితా
- ఇన్ఛార్జి డీజీపీ హరీష్గుప్తాకే అవకాశం
అమరావతి (చైతన్యరథం): కొత్త పోలీస్ బాస్ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్ర నాథ్రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపించింది. వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి జాబితాను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతోన్న విషయం విదితమే. ఆయన డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ఛార్జి నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తోంది. అయితే,మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని, మరో రెండేళ్లపాటు ఆయనకు పోలీస్ బాస్గా పనిచేసే అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది.