- ఏపీని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నాం
- విశాఖకు గూగుల్..అభివృద్ధిలో గొప్ప ముందడుగు
- టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం
- గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు నా ఆలోచన
- వేగవంతమైన నిర్ణయాలతో అంతర్జాతీయ గుర్తింపు
- ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చించుకుంటోంది
- దావోస్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు
దావోస్/స్విట్జర్లాండ్(చైతన్యరథం): ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు బిజీ బిజీగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జా తీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రం లో పారిశ్రామికాభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదికగా ఉందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తాను ఉపయోగించుకున్నానని చెప్పారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల అభివృద్ధి జరుగుతుందని.. తద్వారా పేదలకు సంక్షేమం అందించవచ్చని సీఎం వివరించారు. నాడు సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ తనకు స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నా రు. తాను ఆశావాదినని, భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటని అన్నారు. ముందుచూపుతో వ్యవహరించి, వినూత్నంగా ఆలోచించి, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని సీఎం చెప్పారు. యువతకు ఇదే విషయాన్ని చెబుతూ ఆ దిశగా ప్రోత్స హిస్తున్నానని తెలిపారు.
ఫ్రెండ్లీ గవర్నమెంట్..త్వరితగతిన అనుమతులు
తమది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్న ముఖ్య మంత్రి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సా హకాలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని, వాటి నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైమ్లో మానిట ర్ చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమ తులు ఇవ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా జరిగేలా చర్యలు తీసు కుంటున్నామన్నారు. విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ రావడం ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగుగా చంద్రబాబు అభివర్ణించా రు. ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలో అప్ వల్లే ఆ పెట్టుబడి సాధించామని చెప్పారు. తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ పెట్టుబడిపై లోకేశ్ సంప్రదింపులు జరిపారని వివరించారు.
సంస్కరణలను అందిపుచ్చుకుంటాం…
వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని, రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపీలో ఉత్పత్తికి అడుగులు వేసి పరిశ్రమ నిర్మిస్తున్నామని చెప్పారు. విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని తెలిపారు. టెక్నాలజీ, టెలికాం, విద్యుత్, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగాల్లో వచ్చిన సంస్కరణలతో దేశ దశ దిశ మారిపో యిందని తెలిపారు. 30 ఏళ్ల క్రితం దేశ అభివృద్ధిలో కీలక అడు గులు పడ్డాయని.. నేడు ప్రతి రంగంలో దేశం అద్భుత పురోగతి సాధిస్తోందని చెప్పారు. అప్పుడు.. ఇప్పుడు సంస్కరణలను అంది పుచ్చుకుంటున్నామని, ఆ సంస్కరణలే తమ రాష్ట్రంలోని యువత కు అవకాశాలు కల్పించాయని వివరించారు.
టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం
రాజధాని నిర్మాణం ఒక అవకాశమని.. అద్భుతమైన ప్రణాళిక తో రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పారు చంద్రబాబు. అమరావతి భవిష్యత్ నగరంగా ఉంటుందని, టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. టూరిజం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, మా రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని అన్నారు. ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన ఆలోచనగా పేర్కొన్నారు. ఏపీ అమలు చేస్తున్న విధానాలను, చేస్తున్న ఆలోచన లను, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో గుర్తింపు లభిస్తోందని చెప్పారు. జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుం టోందని తెలిపారు.
భారత్కు అదనపు బలం అదే..
చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారతదేశానికి లేదు.. సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ ఇండి యా అదనపు బలమని తెలిపారు. ఒకప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను దిగుమతి చేసుకునేదని.. అలాంటి పరిస్థితి నుంచి ఆ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. గతంలో డబుల్ డిజిట్ గ్రోత్ అంటే నమ్మలేదని, ఇప్పుడు అదే నిజమైందని వ్యాఖ్యానించారు.















