చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగనన్న భూ సర్వేలో మాయాజాలం

అర్జీలు స్వీకరించిన రెవెన్యూ మంత్రి అనగాని

by చైతన్యరధం
Aug 22, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగనన్న భూ సర్వేలో మాయాజాలం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు
  • భూమి విస్తీర్ణాన్ని తగ్గించి ఆన్‌లైన్‌ చేశారు
  • గ్రీవెన్స్‌లో ఎన్టీఆర్‌ జిల్లా వాసుల వినతి
  • సర్వేయర్‌ లంచం తీసుకున్నాడని ఫిర్యాదు
  • అర్జీలు స్వీకరించిన రెవెన్యూ మంత్రి అనగాని

మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో భాగంగా చేపట్టిన జగనన్న భూ సర్వేలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ భూముల విస్తీర్ణాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించుకుంటున్న రైతులు భూమి విస్తీర్ణాన్ని తగ్గించి నమోదు చేయడంతో విస్తుపోతున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజ నం లేకపోవడంతో సమస్యను చెప్పుకునేందుకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో ప్రజా వినతుల కార్యక్రమానికి వస్తున్నారు. బుధవారం మాజీ మంత్రి కె.ఎస్‌.జ వహర్‌, మహిళా నేత ఆచంట సునీతతో కలిసి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లాకు జగనన్న భూ సర్వే బాధితులు తమ గోడు చెప్పుకున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వే కారణంగా అసలు భూమి ఎకరా 37 సెంట్లు ఉంటే ఎకరా 12 సెంట్లుగా తక్కువ చేసి ఆన్‌లైన్‌లో ఎక్కించారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం తూర్పుమాధవరం గ్రామానికి చెందిన పూల పుష్పావతి వాపో యింది. భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి గ్రామ సర్వేయర్‌ రమేష్‌ లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నాడని, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఆకుతోట లక్ష్మీ నరసింహరావు సమస్యను వివరిస్తూ గత ప్రభు త్వం చేపట్టిన రీ సర్వేలో తమ భూమిని కూడా తగ్గించి ఆన్‌లైన్‌ చేశారని న్యాయం చేయా లని విజ్ఞప్తి చేశాడు.

తాము స్థలాన్ని లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపడితే నాటి వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ రూ.50 లక్షలు లంచం తీసుకుని తాము చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేయించాడని దాంతో తాము తీవ్రంగా నష్టపోయామని కర్నూలుకు చెందిన పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అక్రమ కూల్చివేతలపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

ఉత్తరాంధ్రకు మరో వరం!

తమ ఊరిలో పేదలకు చెందిన 450 ఎకరాలను వైసీపీ నేత నరసింహులు కబ్బా చేసి కంచె వేశాడని అనంతపురం జిల్లా సొమఅందెపల్లి మండలం పోలేపల్లికి చెందిన యలవ బుద్దప్ప ఫిర్యాదు చేశాడు. పొలం దగ్గరకు వెళితే పోలీసులతో కొట్టిస్తున్నాడని, వారి వల్ల 28 కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయని న్యాయం చేయాలని కోరారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన చామకూరి కుసుమకుమారి పద్మా వతి సమస్యను వివరిస్తూ నరసాపురం మండలం లింగబోయనచర్ల గ్రామ పంచాయతీ రామకూరిపాలెం గ్రామంలో కొంత భూమి ఉందని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి అను చరులు దాన్ని కొట్టేయడానికి కుట్రపన్నారని, సర్వేకు దరఖాస్తు చేస్తే నాడు రెవెన్యూ అధికారులు చాలా సార్లు తిరస్కరించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని వాపో యారు. గత వైసీపీ ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు వినతిపత్రం ఇచ్చారు.

చంద్రగూడెంలో తన భర్త తాత కొన్న భూమిలోకి వెళ్లకుండా తమను కొంత మంది గిరిజనులు అడ్డుకుంటున్నారని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించు కోవడం లేదని ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన ఎండపు విజ్ఞేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నాయకులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని వాపోయారు. తమకు ఆ పొలమే ఆధారమని న్యాయం చేయాలని వేడుకున్నారు.

గత 21 సంవత్సరాలుగా తమ సాగులో ఉన్న భూమికి దొంగ పట్టాలు సృష్టించి తమ భూమిని కొట్టేయడానికి గుదె సుబ్బారావు, మిట్టా తిరుపతయ్యలు యత్నిస్తున్నారని కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన వీరనారాయణమ్మ మంత్రికి ఫిర్యాదు చేశారు. సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు.

గత 50 ఏళ్ల నుంచి నేటికీ బయ్యవరం గ్రామంలో 2.50 ఎకరాల భూమి తన స్వాధీనంలో ఉందని.. అయితే తాళ్లపూడి రెవెన్యూ అధికారి ఎన్‌.వి.ఎన్‌.కె.ప్రసాద్‌ ఆ భూమి మరోకరిదిగా చెబుతున్నారని వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఉండ వల్లి వెంకటలక్ష్మి వేడుకున్నారు.

వంశపారపర్యంగా వచ్చిన భూమిలోకి తమను వెళ్లకుండా బెదిరిస్తున్నారని దీనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విచారణ జరిపి న్యాయం చేయాలని పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన గుమ్మళ్ల బ్రహ్మయ్య అర్జీ ఇచ్చారు.

కోర్టు ఉత్తర్వులు ఉన్నా బోగస్‌ పత్రాలు సృష్టించి తమ భూమి 3.04 ఎకరాలను కబ్జా చేసి కట్టడాలు ప్రారంభించారని విచారణ జరిపించి న్యాయం చేయాలని అనం తపురం జిల్లా కదిరికి చెందిన కె.సికిందర్‌ విన్నవించారు.

విజయనగరం జిల్లా పూజపాటిరేగ మండలం కోనాడలో పలువురు వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని రేకుల షెడ్‌లు వేశారని, అంతేకాకుండా స్మశాన స్థలాన్ని కబ్జా చేసి రొయ్యల చెరువులు తవ్వారని ఈ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాసుపల్లి దినేష్‌ ఫిర్యాదు చేశాడు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 750 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించే సత్యసాయి ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌ నిర్వహణకు ఉన్న రూ.2.30 కోట్లను వైసీపీ ప్రభుత్వం రూ.1.20 కోట్లకు తగ్గించిందని దాంతో ప్రాజెక్ట్‌ మెయింటెన్స్‌ సక్రమంగా లేదని సత్యసాయి కార్మికులు తెలిపారు. గత ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, ఏడు నెలల నుంచి పీఎఫ్‌, ఈఎస్‌ఐసీలు కార్మికుల ఖాతాలకు చెల్లించడం లేదని, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డీఈలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.

జి.ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి తనకు మాయమాటలు చెప్పి తన నుంచి రూ.25 లక్షలు కాజేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తిరుపతికి చెందిన పి.గౌతమ్‌ ఫిర్యాదు చేశాడు. అతని నుంచి డబ్బులు ఇప్పించాలని కోరాడు.

మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలానికి చెందిన పారపట్ల రమణప్ప తన సమస్యను వివరిస్తూ మత్స్యకార సంఘ సభ్యులకు వలలు, బోట్లు, ఐస్‌ బాక్స్‌లు, చేప పిల్లలు, మోటార్‌ వాహనాలు సబ్సిడీ కింద ఇవ్వాలని కోరాడు.

ఇది పేదల ప్రభుత్వం: మంత్రి అనగాని
నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి ప్రభుత్వంలోని అరాచకాలను, అన్ని ఇబ్బందులను తొలగించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీవెన్స్‌ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. గతంలో సామాన్యులు ముఖ్యమంత్రి, మంత్రులను సెక్రటేరియట్‌కు వెళ్లి కల వాలంటే సాధ్యపడేది కాదన్నారు. నేడు సీఎం నుంచి మంత్రులు, నేతలు ప్రజలకు అం దుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసి ఇది పేదల ప్రభుత్వమని నిరూపించారని తెలిపారు. గత ఐదేళ్లలో భూ దోపిడీలు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి గత పాలకులు ప్రజలను ఇబ్బంది పెట్టారని చెప్పారు. అటువంటి సమస్యల పరిష్కారానికి వచ్చే నెల నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. భూ సమస్యలతో పాటు పింఛన్‌, రేషన్‌ కార్డు సమస్యలు కూడా వచ్చాయని, వచ్చిన ప్రతి అర్జీదారుడికి న్యాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే మా నాయకుడి లక్ష్యమని, అందుకు తగినట్టు ప్రజల కోసం తామంతా పనిచేస్తున్నామని వివరించారు.

Previous Post

సుప్రీం చెంపదెబ్బ కొట్టినా బుద్ధి రాదా జగన్‌రెడ్డీ?

Next Post

కన్నయ్యా.. నువ్వు గ్రేటయ్యా!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

కార్యకర్త
@ February 28, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ఆంధ్రప్రదేశ్

సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

చైతన్యరధం
@ February 28, 2026
వైసీపీ పుట్టుకే ఫేక్..!
ఆంధ్రప్రదేశ్

నేడు విజయనగరానికి సీఎం

చైతన్యరధం
@ February 28, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist