- బిల్ గేట్స్తో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు
- ఏపీ ప్రభుత్వం -గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం
- ఆరోగ్య, వ్యవసాయ, విద్యారంగాల్లో టెక్నాలజీ వినియోగం
- బిల్గేట్స్ను రాష్ట్రానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూ ఢిల్లీ (చైతన్య రథం): మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. భేటీ అనంతరం బిల్గేట్స్తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా వెల్లడిరచారు. ‘‘బిల్ గేట్స్తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పనవంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రిడిక్టివ్ అనలిటిక్స్వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతోపాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలావుంటే `ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతోపాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాల అమలుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పనవంటి రంగాల్లో విస్తృతస్థాయిలో ప్రయోజనాలు అందించే విధానాలను అభివృద్ధి చేసే అంశాలపై ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాల్లో కొత్త ఆవిష్కరణలను అందించడానికి సంయుక్తంగా పనిచేయనున్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత టెక్నాలజీ ద్వారా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్స్ విభాగాల్లో గేట్స్ ఫౌడేషన్ సహకారం అందించనుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత కార్యక్రమాలకు, సాగు నిర్వహణలో శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు. అదే కొత్త ఆవిష్కరణల ద్వారా ఉపాధి కల్పన అవకాశాలను మెరుగుపరచనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘గేట్స్ ఫౌండేషన్ మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. టెక్నాలజీ ఆధారిత పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో వినూత్న పరిష్కారాలను చూపేందుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిందిగా బిల్ గేట్స్ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ ఒప్పందం ద్వారా డేటా ఆధారిత అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ, సంకల్పాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మెన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. ‘‘ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరకు, సులభంగా లభ్యమమ్యే, స్థానికంగా తయారు చేసే వైద్య పరికరాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని, తద్వారా ప్రజల జీవితాలను మార్చవచ్చన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో ఏఐ, టెక్నాలజీ వినియోగం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవచ్చు’’ అని అన్నారు.
ఢిల్లీలోని హోటల్లో జరిగిన ఈ సమావేశంలో గేట్స్ ఫౌడేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఐటీ శాఖ సెక్రటరీ కాటంనేని భాస్కర్ గేట్స్ ఫౌడేషన్తో ఎంవోయులో పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని, శ్రీనివాస వర్మ, ఎంపి శ్రీకృష్ణ దేవరాయులు, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.