విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్-2లో నాన్ రెల్ టెక్నాలజీస్ యూనిట్కు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు హిల్ నెంబర్-2లోని సంస్థ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. విశాఖలో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కార్యక్రమంలో నాన్ రెల్ టెక్నాలజీస్ ఎండీ వినయ్బాబు మేక, సీఈవో పవన్ కుమార్ సామినేని, ఎంపీ శ్రీభరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.













