చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బటన్ … రివర్స్ బటన్ లతో ప్రజాధనం లూటీ – నారా లోకేష్ ధ్వజం

by admin
Mar 28, 2023 at 12:59pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
Nara Lokesh

Nara Lokesh

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్ రివర్స్ బటన్ తో ప్రజల సొమ్ము దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల బటన్ పేరుతో 10 రూపాయలు ఇచ్చి, పక్కనే వున్న రివర్స్ బటన్ తో రూ. 100 లాగేసుకుంటున్నాడని విమర్శించారు. యువగళం పాదయాత్ర లో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం రెయిన్ బో ఒడిసి వద్ద జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ ప్రపంచానికి సేవాభావం నేర్పిన భగవాన్ సత్యసాయి జన్మించిన నేల పుట్టపర్తి అని లోకేష్ పేర్కొన్నారు.

ప్రతి పేదవాడి చిరునవ్వు లో సత్య సాయి కనిపిస్తారన్నారు. స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన మన చంద్రన్న ముందు టెన్త్ ఫెయిల్ జగన్ కుప్పిగంతులు వేశాడని విమర్శించారు. చంద్రబాబు రాజకీయం ముందు నువ్వెంత జగన్? అమూల్ బేబీ అని వ్యాఖ్యానించారు. జనం జగన్ ని నమ్మడం లేదు. కన్న తల్లి జగన్ ని నమ్మడం లేదు. తోడపుట్టిన చెల్లి జగన్ ని నమ్మడం లేదు అని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ని నమ్మడం లేదు. ఆఖరికి పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని నమ్మడం లేదన్నారు. సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ లో కుర్చొని టీవీలు పగలుగొడుతున్నాడు అని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం జగన్ కి గుండు కొట్టించి రోడ్డు మీద నిలబెట్టారన్నారు. నాలుగేళ్లుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టావ్, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టావ్, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టావ్.

సంబంధితవార్తలు

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – అనంతపురం నియోజకవర్గం

మేము ఏది దాచుకోము అట్టుకు అట్టున్నర పెడతాం బీ రెడీ జగన్ అని హెచ్చరించారు. జగన్ నీకు భయాన్ని సాంపిల్ గా మాత్రమే చూపించాం. పూర్తి స్థాయిలో నువ్వు భయంతో బ్రతికేలా చేసే బాధ్యత నాది అని లోకేష్ చెప్పారు. ఒక్క ఛాన్స్ అన్న మోళీ మోహన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాడని విమర్శించారు. జాబ్ క్యాపిటల్ గా ఉన్న ఆంధ్రా ని గంజాయి క్యాపిటల్ గా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు, చెత్త పన్ను వేసాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇదే రివర్స్ బటన్ అని లోకేష్ వివరించారు.

చంద్రబాబు సంక్షేమ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచి ఆదుకున్నారని చెప్పారు. మోళీ మోహన్ గొప్పగా విద్యా దీవెన, వసతి దీవెన అని పేరు మార్చారే తప్ప ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచలేదన్నారు.జగన్ ఖైదీ కాబట్టి విద్యార్థుల కంటే ఖైదీలకు ఎక్కువ ఛార్జీలు ఇస్తున్నాడని విమర్శించారు. యువతకు అనేక హామీలు ఇచ్చిన మోళీ మోహన్ ఆఖరికి యువత చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడని విమర్శించారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరులో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం అని లోకేష్ వెల్లడించారు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. అందుకే మహిళలు ఎక్కడ చీపుర్లతో కొడతారో అని బయపడి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడని చెప్పారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ. 2500 కోట్లు కొట్టేసాడని ఆరోపించారు.

పన్నుల భారం తగ్గిస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చాక పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతుల్ని ఆదుకోకపోగా మోళీ మోహన్ మోటార్లకు మీటర్లు పెడుతున్నాడన్నారు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అవుతాయని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడని విమర్శించారు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.

పుట్టపర్తిలో ఉన్న రెడ్డి సామాజికవర్గం వారు కూడా ఆలోచన చేయాలని కోరారు. మీరు ఎన్నో త్యాగాలు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. మీరు కనీస గౌరవం దక్కిందా? అని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి తప్ప ఇతర ఏ రెడ్డి సోదరుడు కైనా జగన్ పాలనలో న్యాయం జరిగిందా? జగన్ పాలనలో కాంట్రాక్టులు చేసిన రెడ్డి సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే అని వివరించారు. జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురం కి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసావా? అని ప్రశ్నించారు.

దోపిడీ ఎమ్మెల్యే

పుట్టపర్తి ఎమ్మెల్యే పేరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఆయన ప్రజా ధనం దోపిడీ లో దిట్ట. అందుకే ఆయన పేరు మార్చాను దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి అని లోకేష్ చెప్పారు. దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులు కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని అరాచక కేంద్రంగా మార్చేశారన్నారు. ముందు మీకు జగన్, దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తికి ఇచ్చిన హామీలు గుర్తుచేస్తాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక వలసలు ఉన్న ప్రాంతం పుట్టపర్తి. అలాంటి ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి సాగు, తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో 90 శాతం పనులు పూర్తి చేసాం. ప్రధాన కాలువ పనులు కూడా పూర్తి చేసాం. 2018 లో చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు 193 చెరువులకు నీరు అందించడం కోసం 2018లో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. డిపిఆర్ పూర్తిచేసి పనులు ప్రారంభించిన సమయంలో ప్రభుత్వం మారింది. పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 193 చెరువులకు నీరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. రెండేళ్ల కిందట ఓ జీవో విడుదల చేశారు. 864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు.

ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన హడావిడి మాములుగా లేదు. కొన్ని లక్షలు ఖర్చుచేసి పెద్ద ర్యాలీ చేశారు. ఇక ప్రాజెక్టు కట్టేసినట్లే అని ప్రజలంతా అనుకున్నారు. కాని రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. రెండేళ్లుగా ఒక్క గంప మట్టి కూడా తీయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి కోట్లు పెట్టి ఓ ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడు కానీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం చేసింది శూన్యం అని లోకేష్ వివరించారు. జగన్ రెడ్డి పుట్టపర్తికి వచ్చినపుడు మరో హామీ కూడా ఇచ్చారు. పుట్టపర్తిని అధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా కూడా డెవలప్ చేస్తానన్నారు. చిత్రావతిలో, బుక్కపట్నం చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తికి వచ్చింది లేదు. నిధులు ఇచ్చింది లేదు. పైగా ఈ వైసిపి బ్యాచ్ పుట్టపర్తిలో ఉన్న ప్రశాంతతను, అందాన్ని కూడా చెడగొట్టారు.

మురుగునీటి శుద్ది కేంద్రం (డ్రైనేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్వహణను గాలికొదిలేయడంతో ఇప్పుడు ప్రతిరోజు పుట్టపర్తిలోని కొన్ని లక్షల లీటర్ల మురుగు నీరు బుక్కపట్నం చెరువులోకి వెళ్తోంది. అదే చెరువులో నుంచి తాగునీరు వెళ్తున్న గ్రామాల్లో జనం రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. వైసిపి బ్యాచ్ కబ్జాలు, దౌర్జన్యాల కారణంగా పుట్టపర్తికి భక్తులు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయాన్ని 0.5 టీఎంసీల కెపాసిటీతో 2018లోనే చంద్రబాబు పూర్తి చేశారు. కాలువలు పూర్తి చేసి బుక్కపట్నం, ముదిగుబ్బ మండలాల్లో వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించే క్రమంలోనే ప్రభుత్వం మారిపోయింది. పాదయాత్రలో భాగంగా మారాల వచ్చిన జగన్ రెడ్డి కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారని చెప్పారు.

దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే నా లేక హైదరాబాద్ ఎమ్మెల్యే నా? అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గంలో ఉండేది తక్కువ. హైదరాబాద్ లో ఉండేది ఎక్కువ అని చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరు లేఅవుట్ వేసినా ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాల్సిందే. ఈయనకు కప్పం కడితే చాలు. ప్రభుత్వ అనుమతులేమి అవసరం లేదు. ఈయన వసూలు చేస్తున్న ట్యాక్స్ కారణంగా ఏ ఒక్కరూ లేఅవుట్ కు అనుమతులు తీసుకోవడం లేదు. పుట్టపర్తి చుట్టూ పర్మిషన్ లేని లేఅవుట్ లు కొన్ని వందలు వెలిశాయని వివరించారు. పుట్టపర్తిలో ఓ బిల్డర్ ను బెదిరించి కోటిన్నర రూపాయాలు వసూలు చేశారు. ఓడీసీ మండలంలో టీచర్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ కోసం కోటి రూపాయలు తీసుకున్నారు. కొత్తచెరువు వద్ద ఓ లేఅవుట్ కు దారి కోసం నిర్మించిన బ్రిడ్జి అనుమతి కోసం 75 లక్షలు వసూలు చేశారు అని ఆరోపించారు. పుట్టపర్తిలో ఈ ఎమ్మెల్యే చేసిన అరాచాకాలు, అక్రమాలు చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుందన్నారు.

పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేస్తారని ముందుగానే తెలుసుకుని టౌన్ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు వందల ఎకరాలు కొన్నారు. ఇది కదా అసలైన క్విడ్ ప్రోకో అంటే అని పేర్కొన్నారు. ఇతర జిల్లాలకు చెందిన వైకాపా నాయకులు కూడా జిల్లా కేంద్రం ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఇక్కడ భూములు కొన్నారు. భూ వివాదాలు వీరే సృష్టిస్తారు. తర్వాత వాటిని పరిష్కరించినట్టు కలరింగ్ ఇచ్చి కమీషన్ రూపంలో లక్షలు కొట్టేస్తారని చెప్పారు. నాలుగేళ్లలో వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఇక్కడ సంపాదించిన డబ్బును తీసుకెళ్లి బెంగళూరు, హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతున్నారన్నారు. భూముల్లో కోట్లు గడించిన ఎమ్మెల్యే పేదల బియ్యాన్ని కూడా వదలడం లేదు. బినామీలను ముందు పెట్టి ప్రతి రోజు రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. మిల్లుల వ్యాపారులతో కుమ్మక్కై దందా చేస్తున్నారు. ఇక్కడ రేషన్ బియ్యాన్ని కర్ణాటకలో పాలిష్ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. కర్ణాటకలో 10 రూపాయల తక్కువకు కొని ఇక్కడ 10 రూపాయలు ఎక్కువకు ఇస్తున్నారని చెప్పారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్య స్థానికంగా ఉపాధి అవకాశలు లేకపోవడం. ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల నుంచి పెద్దఎత్తున కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇక్కడి నుండి కేరళకు వెళ్లిన కొందరు అక్కడ బిక్షాటన చేసి బతుకుతున్న దౌర్బగ్యం. ఈ పరిస్థి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు రావాలి. గతంలో జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అమడగూరు మండలంలో సైన్స్ సిటీ, సోలార్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి వేల ఎకరాల భూమి సేకరించారు. పూర్తిగా పరిహారం కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. తండ్రి ఇచ్చిన హామిని అమలు చేయడంలో జగన్ రెడ్డి పూర్తిగా ఫెయిలయ్యారు అని విమర్శించారు.

పుట్టపర్తి సమీపంలోని కప్పలబండ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు టిడిపి శ్రీకారం చుట్టింటి. ఏపీఐఐసీ ద్వారా 110 ఎకరాలు సేకరించి ఎంఎస్ఎంఈ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసాం. అయితే దురద్రుష్టవశాత్తు ప్రభుత్వం మారిపోవడంతో అవన్ని ముందుకు సాగలేదు. టిడిపి అధికారంలోకి రాగానే పుట్టపర్తి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తాం. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి లేకుండా చేస్తాం అని వెల్లడించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని రకాల పంటలు పండించేందుకు అనువైన భూములు ఉన్నాయన్నారు. అయితే సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హంద్రీనీవా ద్వారా చెరువు నింపి ఉంటే రైతులు బాగుపడేవారు. అయితే పైనున్న జగన్ రెడ్డికి, ఇక్కడున్న ఎమ్మెల్యేకు వారి స్వప్రయోజనాలు తప్ప జనాలు గురించి పట్టదు. టిడిపి హయాంలోనే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువుకు నీరిచ్చాం. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తి చేశాం. మళ్లీ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇస్తున్నా అని వెల్లడించారు.

పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసి ఏడాది కావొస్తోంది. సత్యసాయి ట్రస్టు పుణ్యమా అని బిల్డింగులన్ని ఉచితంగా వచ్చేశాయి. కాని జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డిపార్ట్ మెంట్లోనూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. చాలా డిపార్ట్ మెంట్లలో ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేదు. చాలా విభాగాల్లో ఫైల్స్ పెట్టుకోవడానికి బీరువాలు లేవంటే ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డీఎంహెచ్ వో ఆఫీసులో ఉద్యోగులు మొన్నటివరకు నేలమీద కూర్చొని పనిచేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం అని చెప్పారు.

పుట్టపర్తి టౌన్ లో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించేందుకు టిడిపి హయాంలో 100 కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తిచేస్తామని ప్రకటించారు. టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు మంజూరు చెయ్యకుండా లబ్ధిదారులను వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్లు కేటాయిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

Tags: latest political updatesNara lokeshTDPTDP Newsyuvagalam padayatra
Previous Post

లోకేష్ ది లక్కీ లెగ్ అని తేలిపోయింది !

Next Post

చంద్రబాబు ఓకే అంటే వైసీపీ ఖాళీ!

మరిన్ని వార్తలు

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

చైతన్యరధం
@ January 10, 2026
మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి
ఆంధ్రప్రదేశ్

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

చైతన్యరధం
@ January 10, 2026
మీ భూమి… మీ హక్కు
ఆంధ్రప్రదేశ్

మీ భూమి… మీ హక్కు

చైతన్యరధం
@ January 10, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించారు

చైతన్యరధం
@ January 10, 2026
వేగమే ఆయుధం!
ఆంధ్రప్రదేశ్

వేగమే ఆయుధం!

చైతన్యరధం
@ January 9, 2026
రూ.200 కోట్లతో ఐదేళ్లలో 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు
ఆంధ్రప్రదేశ్

రూ.200 కోట్లతో ఐదేళ్లలో 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు

చైతన్యరధం
@ January 9, 2026
జగన్‌ ఎంతగా అడ్డుపడ్డా..అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఎంతగా అడ్డుపడ్డా..అమరావతి ఆగదు

చైతన్యరధం
@ January 9, 2026
మనందరిదీ ఒకే మాట.. ఒకే బాట
ఆంధ్రప్రదేశ్

మనందరిదీ ఒకే మాట.. ఒకే బాట

చైతన్యరధం
@ January 9, 2026
Load More

ముఖ్య వార్తలు

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

చైతన్యరధం
@ January 10, 2026
మీ భూమి… మీ హక్కు

మీ భూమి… మీ హక్కు

చైతన్యరధం
@ January 10, 2026
వేగమే ఆయుధం!

వేగమే ఆయుధం!

చైతన్యరధం
@ January 9, 2026
రూ.200 కోట్లతో ఐదేళ్లలో 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు

రూ.200 కోట్లతో ఐదేళ్లలో 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు

చైతన్యరధం
@ January 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

చైతన్యరధం
@ January 10, 2026
మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

చైతన్యరధం
@ January 10, 2026
మీ భూమి… మీ హక్కు

మీ భూమి… మీ హక్కు

చైతన్యరధం
@ January 10, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

తిరుమలలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించారు

చైతన్యరధం
@ January 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist