- ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు
- అకాల వర్షాలు, గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
- జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
- ఇప్పటివరకు పంట నష్టాన్ని రూ.63 కోట్లుగా లెక్కించిన అధికారులు
అమరావతి (చైతన్యరథం): భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్ర వారం క్యాంప్ కార్యాలయంనుంచి జిల్లాకలెక్టర్లు, ఉన్న తాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12జిల్లాల్లోని 42 మండలా ల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టంవాటి ల్లిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి విలువ రూ.40కోట్లుగా లెక్కగట్టారు. అలాగే 9 జిల్లాల్లోని 48మండలాల్లో 1,301 హెక్టార్లలో ఉద్యాన పంటలపైనా వర్షాలు ప్రభావం చూపాయన్నారు. అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినగా… నష్టం విలువ రూ.23కోట్లుగా అంచనావేశారు. ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం అన్ని పంటలకు కలిపి మొత్తం నష్టం రూ.63 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. మరోవైపు ఎల్పీజీ సరఫరాపైనా సీఎం సమీక్షించారు.
ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా మధ్య మరి కొన్నాళ్లు యుద్ధం కొనసాగితే… ఎల్పీజీ గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొ నేలా రాష్ట్రంలో సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు. ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరా యం రానివ్వకుండా చూడాలన్నారు. గ్రామీణ -గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలు, అన్న క్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్ డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
















