- 5 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం
- మంత్రులందరం బాధ్యతగా పనిచేస్తున్నాం
- 99 పైసలకే భూమిపై టీమ్ 11 రాద్ధాంతం
- గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఆసిప్
- అవన్నీ అడ్రస్ లేని కంపెనీలా?
- లిఫ్ట్ పాలసీతో పెద్దఎత్తున పెట్టుబడులు
- శాసనసభలో మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): ఐటీ రంగంలో విశాఖపట్నాన్ని గ్లోబల్ మ్యాప్లో పెట్టబోతున్నాం. ఐదేళ్లలో ఒక్క ఐటీ రంగం లోనే విశాఖ కేంద్రంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి నాకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని ఒక బాధ్యత గా చేపట్టి మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తూ విశాఖ పట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొ న్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ బడ్జెట్ డిమాండ్స్పై అసెంబ్లీలో లోకేష్ ప్రసంగించారు. హైదరా బాద్, బెంగళూరుల్లో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది..దానిని ఆంధ్రప్రదేశ్లో పదేళ్లలో చేసి చూపిస్తాం. ప్రజాప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక పెద్దఎత్తున ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఒక్క ఐటీ/ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రూ.1.50 లక్షల కోట్ల విలువైన 52 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా 2.3 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. క్వాంటంలో కూడా పెద్దఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్దఎత్తున పెట్టుబ డులు వస్తున్నాయి, ఇందుకు సభ్యులందరి సహకారం అవస రం. టీమ్ -11కి కూడా ఆఫర్ ఇస్తున్నా. మీకు తెలిసిన కంపెనీ లు ఉన్నా చెప్పండి..కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. రాజకీయాలు రాష్ట్రం లోపల చేద్దాం. బయటకు వెళ్లినప్పుడు కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడదాం. సభ్యులకు తెలిసిన ఐటీ కంపెనీలు ఉంటే వివరాలు మాకు పెట్టండి. పర్సనల్గా ఫాలో అప్ చేసి గ్రౌండ్ చేసేందుకు కృషిచేస్తాం.
వైసీపీ విధ్వంస పాలనకు అదొక ఉదాహరణ
గత ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమలపైన, ఐ{/ ఎలక్ట్రానిక్స్ సంస్థలపై ఒక యుద్ధమే చేసింది. వారి చర్యల వల్ల రాష్ట్ర యువత తీవ్రంగా నష్టపోయింది. 2014-19 నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనాన్సియల్ సర్వీసెస్లో వరల్డ్ బెస్ట్ అయిన ఒక ఫార్చ్యూన్- 500 కంపెనీతో మాట్లాడి ఒప్పించ డంతో ఆ కంపెనీ సీఈవో వచ్చి విశాఖలో కార్యాలయం ప్రారంభించారు. ఆ తర్వాత చంద్రబాబుపై కక్షతో ప్రభుత్వానికి డబ్బులిచ్చి భూకేటాయింపులు చేసుకున్నారని ఆ కంపెనీపై పార్లమెంటులో వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. వారి ఆరోపణల వల్ల ఆ గ్లోబల్ కంపెనీ సీఈవో.. చైర్మన్ అయ్యే ప్రక్రియ ఆరునెలలు ఆలస్యమైంది. వైసీపీ విధ్వంస పాలనకు ఇదొక ఉదాహరణ మాత్రమే. భారీ పరిశ్రమలు, ఎనర్జీ శాఖల్లో ఇలాంటివి మరెన్నో జరిగాయి. ఆనాటి ప్రభుత్వ టెర్రరిజానికి ఇదొక ఉదాహరణ. 2019-24 నడుమ ఒక్క ఐటీ కంపెనీకి కూడా ఇన్సెంటివ్స్ విడుదల చేయలేదు.
ఐటీ/ఎలక్ట్రానిక్స్ శాఖలో 8 పాలసీలు
2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంపెనీలతో మాట్లాడినపుడు వారు భయాన్ని వ్యక్తం చేశారు. మీరు ఐదేళ్లు అధికారంలో ఉండి పాలసీలు తయారుచేస్తారు, గత పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు ఏమిటి, గతంలోనూ వారి వల్ల నష్టపోయాం, అలాంటి పరిస్థితులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారని పరిశ్రమదారులు మమ్మల్ని ప్రశ్నించారు. తెలంగాణకు హైదరాబాద్ ఉండొచ్చు, తమిళనాడుకు చెన్నై ఉండొచ్చు, కర్ణాటకకు బెంగుళూరు ఉండొచ్చు.. ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబు ఉన్నారని చెప్పాను. చంద్రబాబు పరిపాలన అనుభవంతో మాకు డైరెక్షన్ ఇవ్వగా, ఐటీ/ఎలక్ట్రానిక్స్ శాఖలో 8 పాలసీలు తీసుకువచ్చాం. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీ కండక్టర్, ఫ్యాబ్ పాలసీ, ఐటీ/గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్ మ్యాను ఫ్యాక్చరింగ్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టేకప్స్ (లిఫ్ట్) పాలసీ, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ, భారతదేశంలోనే తొలిసారిగా క్వాంటం కంప్యూ టింగ్ పాలసీలను మా శాఖ ద్వారా తీసుకువచ్చామని తెలిపారు.
మోదీ స్ఫూర్తితో పాలసీ
ప్రధాని నరేంద్ర మోదీజీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ నానో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పశ్చిమబెంగాల్ వెళ్లారు. అక్కడ ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొంద రు ఉద్యమం చేస్తే.. నరేంద్రమోదీ టాటా చైర్మన్కు ఒక ఎసఎంఎస్ పంపి ఒక రూపాయికి భూమి కేటాయిస్తే గుజరా త్లో పెట్టుబడి పెట్టాలని కోరారు. ఆ ఒక్క ఎసఎంఎస్తో నానో ఫ్యాక్టరీ గుజరాత్కు వెళ్లింది. దానికి అనుబంధంగా 60 యాక్సి లరీ యూనిట్లు కూడా అక్కడకు వచ్చాయి. టాటా నానో ప్రొడక్షన్ ఆగిపోయినా ఈ రోజు టాటా ఈవీ కార్లు ఆ ఫ్యాక్టరీలో తయారవు తున్నాయి. అక్కడ ఒక ఎనకమిక్ ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో క్యాబినెట్లో చర్చించి గ్లోబల్ స్థాయిలో వరల్డ్ క్లాస్ జాబ్లు క్రియేట్ చేసే టాప్-500 ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి యువత కు ఉద్యోగాలు కల్పిస్తే ఎకరా రూపాయికి భూమిని కేటాయిస్తా మని చెప్పి లిఫ్ట్ పాలసీ తెచ్చాం.
రూపాయికి ల్యాండ్ ఇస్తామంటే నమ్మలేదు
టీమ్-11 ఈరోజు బయట నాపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మొదటిసారి దావోస్కు వెళ్లినపుడు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరాను. ఎకరానికి 500 ఉద్యోగాలు మా బెంచ్ మార్కు..మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలని సీఈవోను అడిగాను. ఆ మేరకు ఎంత ల్యాండ్ కావాలన్నా ఎకరా రూపాయికి ఇస్తామని చెబితే ఆయన నమ్మలేదు. మాకు చిత్తశుద్ధి ఉంది..చేసి చూపించే సత్తా మా ముఖ్యమంత్రికి ఉందని చెప్పాను. ఆ ఒక్క నిర్ణయంతో ఈరోజు కాగ్నిజెంట్ విశాఖకు వచ్చి శంకు స్థాపన కూడా పూర్తిచేసింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీనివల్ల విశాఖ ఎకనమిక్ రీజియన్లో 1.8 బిలియన్ల నుంచి 2.2 బిలియ న్ డాలర్ల వరకు ఎనకమిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇదొక ఉదాహ రణ మాత్రమే.
గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ వెనుక కథ
గూగుల్ ఇన్ ఫ్రా హెడ్ విశాఖకు వస్తే నేను రహస్యంగా కారు లో తీసుకెళ్లి వారికి ఇస్తున్న భూమి చూపించి ఇన్సెంటివ్స్పై కమిట్ అయ్యాం. ఆ తర్వాత వారు కొన్ని మినహాయింపులు కోరారు. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. డేటా సెంటర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పాలసీ తీసుకురావాల్సి ఉంటుంది. పర్మినెంట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు సవరణ తేవాల్సి ఉందని చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీతో మాట్లాడారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వనీ వైష్టవ్తో మాట్లాడాం. కేంద్రప్రభుత్వం అద్భుతమైన ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఎఫ్డీఐ వి15 బిలియన్ డాలర్లు విశాఖకు వచ్చింది. ఫలితంగా విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల ఏడాదికి వి3 బిలియన్ డాలర్ల ఎకనమిక్ ఇంపాక్ట్ ఉంటుంది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ని చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అధికారికంగా ఆహ్వానించారు. ఎకనమిక్ అడ్వ యిజర్ కౌన్సిల్ చైర్మన్గా ఉండాలని కోరారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేయగా, ముఖ్యమంత్రిపై ఉన్న గౌరవంతో తప్పనిసరిగా ఏర్పాటుచేస్తానని చెప్పారు. వారికి భూమి కేటాయించాం, టెంపరరీ సెంటర్ ఇప్పటి కే ఏర్పాటైంది..త్వరలో రిబ్బన్ కటింగ్ చేయబోతున్నామని తెలిపారు.
వారు చేయకపోగా చేసే వాళ్లను అడ్డుకుంటున్నారు
సౌత్ ఇండియాలో అతిపెద్ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆసిప్ ప్యాకేజింగ్ యూనిట్, ఓసాట్ ఏటీఎంపీ ఫెసిలిటీ విశాఖలో ఏర్పాటు చేశారు. వారికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద పీఎలఐ స్కీమ్ వచ్చింది. పొరుగు రాష్ట్రానికి వెళ్తామంటే మేం పోటీపడి ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చాం. ఆ కంపెనీకి చౌకగా భూమి ఇస్తామని ఐటీ సెక్రటరీ కమిట్ కావడంతో మేం బాధ్యత తీసుకున్నాం. దీనివల్ల వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తారన్న ఆలోచనతో వారికి కూడా ఎకరా రూపాయి చొప్పున భూమి కేటాయించాం. అడ్రస్ లేని కంపెనీలకు మేం చౌకగా భూములిస్తున్నామని టీమ్ 11 మాపై ఆరోప ణలు చేస్తున్నారు. కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్, ఆసిప్ అడ్రస్ లేని కంపెనీలా? వారు చేయకపోగా చేసే వాళ్లను అడ్డుకుంటున్నారు. దీనిపై వారు కోర్టుకు కూడా వెళ్లారు, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు భూములిస్తే తప్పేంటని చీఫ్ జస్టిస్ ప్రశ్నించి పిల్ను కొట్టేశారు. పరిశ్రమలను రప్పించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈ రోజు డిజిటల్ ఎకో సిస్టమ్ ప్రారంభమైంది. త్వరలో విశాఖ కేంద్రంగా అనేక ఐటీ కంపెనీల నుంచి ఎనౌన్స్మెంట్లు రాబోతున్నాయి. 99 పైసలకే భూములు కేటాయించే లిఫ్ట్ పాలసీ వల్ల పెద్దఎత్తున పెట్టుబడులు విశాఖకి వస్తున్నాయని వివరించారు.
వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యం
వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యసాధనకు ముఖ్యమంత్రి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకువచ్చారు. ఇప్పటికే 13 వేల మంది విద్యార్థులు ముందుకురాగా 772 స్టార్టప్ ఐడియాలకు సహకారం అందించాం. రైజప్ ఎంఎసఎంఈలకు కూడా మద్దతు ఇస్తున్నాం. ప్రత్యేకించి మహిళల కోసం ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎనఆరఐలకు సన్రైజ్ కనెక్ట్ పేరుతో తెలుగు డయాస్పోరాను ప్రోత్సహిస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. 2014లో రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. 2019-24 నడుమ గత ప్రభుత్వ విధానాల వల్ల మరికొంత నష్టపోయాం. కలిసికట్టుగా అందరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చి, మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.















