- మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారు
- తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు
- గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం
- రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం
- చేసే పనులు చెప్పుకోవాలి
- జమ్మలమడుగు నియోజకవర్గ సమావేశంలో మంత్రి లోకేష్
జమ్మలమడుగు (చైతన్య రథం): అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం, దత్తలూరు వద్ద ఏర్పాటుచేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ కష్టకాలంలో పసుపు జెండాకు అండగా నిలబడిన వ్యక్తి భూపేష్ రెడ్డి అని, మాటలు తక్కువైనా చేతలు ఎక్కువ అని అభినందిం చారు. జమ్మలమడుగు జోష్ అదిరిపోయిందని, పౌరు షాల గడ్డ ఇదని పేర్కొన్నారు. పెన్నా నది నీళ్లలోనే తేడా ఉందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మూడు సాగునీటి ప్రాజెక్టులు, నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, గండికోటను, టీడీపీని ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు.
మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారు
ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచిందని, గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నామని మంత్రి గుర్తు చేశారు. కోటి మంది సభ్యులు టీడీపీ సొంతమని, బడుగు, బలహీన వర్గాల ను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశంపార్టీ అని పేర్కొ న్నారు. 2019–24మధ్య అనేక ఇబ్బందులు పెట్టా రని, కార్యకర్తలు తెగువ చూపారని, వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తుచేశారు. జగన్రెడ్డికి చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చని, అద్భుత నటుడు జగన్మోహన్రెడ్డి అని, సినిమాల్లో నటిస్తే ఆస్కార్ అవార్డ్ వస్తుందని చమత్కరించారు. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారని, ఇంకో చెల్లి తండ్రిని చంపి అన్యాయం చేశారని, సొంత జిల్లా ప్రజలను మోసం చేశారని, సొంత బాబాయిని లేపేసి నెపం మనపై నెట్టారని ఆరోపిం చారు. గుండెపోటు కాదది, గొడ్డలిపోటు అని, కోడి కత్తి, గులకరాయి డ్రామా చూశామని, మొన్న కడప పట్టణంలో జరిగింది కూడా అదే కుట్ర అని పేర్కొ న్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
చేసే పనులు చెప్పుకోవాలి
కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని, నాడు, నేడు ఎప్పుడూ పార్టీకి కార్యకర్తలు అండగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. పనిచేసే వారిని గుర్తించేందుకే మై టీడీపీ యాప్ తీసుకువచ్చామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పెన్షన్ అందిస్తున్నామని వివరించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా రూ. 15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు, చెప్పారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని, 10 వేల ఉద్యోగాలకు సింగిల్ జాబ్ కేలండర్ విడుదల చేశామని వివరించారు. చేసే పనులు చెప్పుకోవాలని, పార్టీలో సంస్కరణల కోసం తాను పోరాడానని, సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా పోరాడాలని, అలిగి ఇంట్లో కూర్చోకూడదని సూచించారు. 2019-24 మధ్య కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగిస్తున్నామని వివరించారు.
రప్పా, రప్పా అంటే భయపడేవారు ఎవరూ లేరు
రప్పా, రప్పా అంటే భయపడేవారు ఎవరూ లేరిక్కడ అని, వారి నాయకుడిని, తండ్రిని చూశామని మంత్రి అన్నారు. రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత తనదని, రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నా రని, చివరకు ఎర్ర కారు చూసినా భయపడుతున్నా రని చమత్కరించారు. జగన్ రెడ్డిది బెంతాహై అని, మూడు రోజులు బెంగళూరు, మూడు రోజులు హైద రాబాద్, ఒకరోజు తాడేపల్లిలో ఉంటున్నారని పేర్కొ న్నారు. ఆయనకు సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉందని, వైసీపీ కుట్రల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
ప్రకటించామని, లక్ష కోట్ల ఔట్లేతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని వివరించారు. రాయలసీమలో కార్లు పరిగెత్తించామని, నేడు ఫైటర్ జెట్లు వస్తున్నాయని అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానమని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేతలు మానవ సంబంధాలు పెంచు కోవాలని, తాను రెండే కార్లు వినియోగిస్తున్నానని, నేతలు అహంకారం వీడాలని సూచించారు. జమ్మల మడుగుకు ఎంఎస్ఎంఈ కంపెనీలను తీసుకువస్తా మని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తలు, ప్రజల ను కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారా నికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎస్. సవిత, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ సీహెచ్.భూపేష్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు ఎం.రామకృష్ణ, కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వైఎస్. జుబులిలా, జోనల్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












