- ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యసేవలే లక్ష్యం
- ఇంటి వద్దే 42 వైద్య పరీక్షలు..రిపోర్ట్
- త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా సేవలు
- మెరుగైన ప్రజారోగ్యం కోసం ఉద్యమం
- ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ
- ఆరోగ్యమే సమాజానికి నిజమైన సంపద
- రాయలసీమను బంగారు సీమగా మారుస్తాం
- కర్నూల్లో బంగారం ఉత్పత్తి ప్రారంభించబోతున్నాం
- రూ.లక్ష కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధి
- అక్కడి నుంచే యుద్ధ విమానాలు రానున్నాయి
- పూతలపట్టు సంజీవనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు
పూతలపట్టు/చిత్తూరు(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికోసం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సంర క్షించేలా సంజీవని కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించా రు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి సంజీవని ప్రాజెక్టు ఏపీ వ్యాప్తంగా అమలు అవుతుందని ప్రకటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. సంజీవని కేవలం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదని, ఇది ఓ సమగ్ర డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్ అని అభివర్ణించారు. ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. సంజీవని ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సిటిజెన్ వెల్ నెస్ మిషన్ అని వ్యాఖ్యానించారు. ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరెటివ్ అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ వ్యవస్థ పని చేస్తుందని సీఎం అన్నారు. ముందస్తుగా గుర్తించటం, వ్యాధి రాకముందే నివారణ, చికిత్సల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను వైద్యులు నిరంతరం పర్య వేక్షించేలా ఈ వ్యవస్థ సేవలందిస్తుందని వెల్లడించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమం… ఈ ఏడాది మార్చి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ లు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం
చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజారోగ్యానికి అవసరమైన ప్రతీ అంశా న్ని సంజీవని ప్రాజెక్టు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. డాక్టర్ అప్పాయింట్మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్
రికార్డుల పర్యవేక్షిస్తామని వివరించారు. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా వైద్యసేవలు పొందేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. వైద్య ఖర్చులు భరించలేక కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయాయని, ఆ ఇబ్బందులను తప్పించడానికే ప్రజా ప్రభుత్వం సంజీవనిలాంటి వినూత్న ప్రాజెక్టు తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో విద్య-వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ఉద్యమం చేపట్టామని చెప్పారు. ఈసారి బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి రూ.19,305 కోట్లు కేటాయించినట్టు వివరించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా రూ.2,601 కోట్ల ఆరోగ్య గ్రాంట్లు పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలో పేదా ధనికా తేడా లేకుండా ప్రతీ ఒకొక్కరికి రూ. 2.50 లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తామన్నారు. రూ.25 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ద్వారా వైద్య ఖర్చులు భరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పేదలకు సైతం మెరుగైన వైద్యం అందిం చేందుకు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నామని వివరించారు. మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయా మం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఆహారమే ఔషధం – వంటశాలే ఔషధ శాల అని మరోమారు సీఎం స్పష్టం చేశారు. ప్రజారోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వివరించారు.
శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్న వరకూ కృష్ణా నీరు
సమాజంలో ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించటంతో పాటు ప్రతీ నీటి బొట్టునూ సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థ నీటి నిర్వహణ ద్వారా జల నవరులను కాపాడుతున్నామని.. భూగర్భ జలాలు కూడా పెంచగలిగామని తెలిపారు. సముద్రంలో వృథాగా పోయే జలాల ను సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింటినీ నింపగలిగామని వివరించారు. హంద్రీ-నీవా కాలువతో రాయలసీమ జిల్లాల్లోని చివరి ప్రాంతాలకు నీరు తీసుకెళ్లామని అన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ యంత్రాం గం తీసుకున్న చర్యలతో భూగర్భ జలాలు పెరిగాయని, ఈ కారణంగానే అక్కడ పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ఎల్న్ని ప్రభావంతో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదు అవుతున్నాయని పిడుగురాళ్లలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని అన్నారు. వర్షపాతం తక్కువ కురు స్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసే సంకల్పంతో ఉన్నామని దీనిపై ఇప్పటికే క్యాలెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. నీవా పనులు పూర్తి చేసి పూతలపట్టు మీదుగా చిత్తూరు వరకు కృష్ణా నీటిని తీసుకు వస్తామన్నారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్న వరకూ నీటిని తరలిస్తా మని చెప్పారు. గాలేరు-నగరి కోడూరు వరకు, మల్లె మడుగు బాలాజీ రిజర్వాయర్- 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామ న్నారు. సోమశిల, స్వర్ణముఖి లింక్ కెనాల్ -జూన్ 2028 పూర్తి అవుతుందని వెల్లడించారు.
రాయలసీమ ఇక ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం
23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని… రాష్ట్రంలోని 23 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమలోని పుట్టపర్తిలో 5 జనరేషన్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని… యుద్ధాల్లో పాల్గొనే జెట్ ఫైటర్ యుద్ధ విమానాల తయారీ కేం ద్రంగా పుట్టపర్తి మారబోతోందని తెలిపారు. రాయలసీమను డిఫెన్స్ హబ్ చేస్తామన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖ లో గూగుల్ డేటా సెంటర్, కర్నూలులో డ్రోన్, అనంతపురంలో ఏరోస్పేస్, స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ లాంటివి ఏర్పాటు కానున్నాయని వివరించారు. తిరుపతిలోనే త్వరలోనే బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందన్నారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమ, సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు వచ్చే నెల కర్నూల్లో బంగారం ఉత్పత్తి చేసే గనులను కూడా ప్రారంభించబోతున్నట్టు సీఎం తెలిపారు. రూ. లక్ష కోట్లతో రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ధి చేస్తాం.
ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్లు, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తాయన్నారు. పశ్చిమాసి యాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత, పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినా… సమస్య తాత్కాలికమేనని పేర్కొన్నారు. మహిళల కోసం కూటమి సర్కారు తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం 2 లాంటి పధకాలు అమలు చేసిందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ పాటు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రజా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళి ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ, చిత్తూరు జిల్లా ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.













