- వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు రండి
- క్వాంటినమ్ టెక్నాలజీస్ సీఈవోతో సీఎం చంద్రబాబు
- ప్రపంచస్థాయి ఎకోసిస్టం అభివృద్ధికి సంస్థ ఆసక్తి
అమరావతి(చైతన్యరథం): క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్య త్ టెక్నాలజీగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరాపతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయటం ప్రారంభిస్తుందని.. ఇప్పటికే క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీలు ఏపీలో పనిచేయడం ప్రారంభించాయని వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి ఫుల్ స్టాక్ క్వాంటం కంప్యూ టింగ్ కంపెనీ క్వాంటినమ్ సంస్థ సీఈవో రాజీబ్ హజ్రా సహా ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమం త్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతి క్వాంటం వ్యాలీని క్వాంటం ఇన్నోవేషన్ సహా పరిశోధనలు తదితర అంశా ల్లో కీలకమైన హబ్ తయారుచేసేందుకు వ్యూహాత్మక భాగ స్వామ్యాల ఏర్పాటుపై చర్చించారు.
జాతీయ క్వాంటం మిషను అనుగుణంగా ప్రపంచస్థాయి ఎకోసిస్టంను అభివృద్ధి చేసేందుకు ఏపీతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు క్వాంటినమ్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. క్వాంటం నైపుణ్యాలు, ఏఐ ఎనెబుల్డ్ క్వాంటం అప్లికేషన్లు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చి, స్టార్టప్ ఇంక్యుబేషన్ టెక్నాలజీలపై పనిచేయాలని సీఎం సూచించారు. గతంలో ఐటీని ప్రోత్సహించాం.. ఇప్పుడు ఏఐ, క్వాంటం టెక్నాల జీల ద్వారా వేగంగా సమస్యలకు పరిష్కారం అందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. క్వాంటం పరిశోధనలకు ఏపీ అమరావతి అత్యుత్తమ ప్రాంతమని పేర్కొన్నారు. ఏపీలో క్వాంటం కంప్యూటర్ పరికరాల ఉత్పత్తితో పాటు అల్గారిథమ్స్ వరకూ సహ కారం అందించేందుకు తాము సిద్ధమని క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఉపాధ్యక్షు డు సీతారామకృష్ణ, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.














