- ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
- సరిహద్దుల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్ట
- మద్యం దుకాణాల పునరుద్ధరణ
- ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువైనా కఠిన చర్యలు
- 175 నియోజకవర్గాల్లో .20,400 5 616 అభివృద్ధి పనుల మంజూరు
- వాట్సప్ గవర్నెన్స్, క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలతో పారదర్శక పౌర సేవలు
- 2027 మార్చి నాటికి సమగ్ర ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన.. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
- పబ్లిక్ సర్వీస్, సుపరిపాలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు
మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ, పౌర సేవలను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. నాయకులు, ప్రజాప్రతి నిధులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై మానవత్వంతో స్పందించాలని పిలుపునిచ్చారు. ‘లీడర్షిప్ కాంక్లేవ్’లో “ప్రభుత్వ, పాలనా సేవల అంశం”పై ఆయన ప్రజాప్రతినిధులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మార్పీకే మద్యం..
ఉచిత ఇసుక పక్కదారి పట్టొద్దు
సంవత్సరానికి రూ.1,000 కోట్ల ఆదాయాన్ని సైతం వదులుకుని ప్రజల కోసం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని సీఎం చెప్పారు. రీచ్ల వద్ద పరిస్థితిపై నిరంతర నిఘా ఉంచామని, ఉచిత ఇసుక పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కఠినంగా అడ్డుకోవాలని సూచించారు. “గత ప్రభుత్వంలో నకిలీ మద్యం, జే బ్రాండ్ల వల్ల దాదాపు 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మద్యం రంగాన్ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా మార్చాం. త్వరలోనే టెండర్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఉన్న దుకాణాలనే రెన్యువల్ చేస్తాం. అయితే ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి అదనంగా అమ్మినా సహించేది లేదు. నియోజకవర్గాల్లో ఏ చిన్న అవకతవకలు జరిగినా ఎమ్మెల్యేలదే బాధ్యత” అని హెచ్చరించారు.
డిజిటల్ విప్లవం.. వాట్సాప్ గవర్నెన్స్
పాలనలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తున్నామని, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలన్నీ ఆన్లైన్లోనే అందిస్తున్నామని సీఎం తెలిపారు. భూ యజమానుల భద్రత కోసం క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని వెల్లడించారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలో ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన పూర్తవుతుందని… దాంతో మెజారిటీ భూ వివాదాలకు శాశ్వత ముగింపు పడుతుందని చెప్పారు. అలాగే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని, గత మూడేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అంతా రూఫ్ టాప్ సోలార్వైపు మొగ్గు చూపాలని కోరారు.
175 నియోజకవర్గాలకు రూ.20,400 కోట్ల పనులు
గత కాంక్లేవ్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన స్థానిక సమస్యలను సమీక్షించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన 616 పనులు మంజూరు చేసిందని సీఎం ప్రకటించారు. “నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను సుమోటోగా తీసుకుని పరిష్కరించండి. దీనివల్ల ప్రజలకు మేలు జరగడమే కాకుండా మీకు మంచి బ్రాండ్ వస్తుంది. నివాసముంటూ అభ్యంతరాలు లేని స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి క్రమబద్ధీకరణ చేస్తాం” అని హామీ ఇచ్చారు.
జెన్నీ ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు
ప్రజాప్రతినిధి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రజలకు చేరువ కావాలని, కనీసం వాయిస్ మెసేజ్ ద్వారా అయినా వారితో కనెక్ట్ అవ్వాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఫిర్యాదులను క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పక్కాగా పరిష్కరించాలన్నారు. ‘రాబోయే పదేళ్లలో వచ్చే సవాళ్లు, మార్పులను ఇప్పటినుంచే అంచనా వేయాలి. జెనో యువత రియల్ టైమ్ నిర్ణయాలతో వేగంగా ఆలోచిస్తోంది, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంతో కొందరు చేస్తున్న కుట్రలను సరైన ఫ్యాక్ట్ (నిజాల) తో తిప్పికొట్టాలి’ అని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.















