- పేదల జీవితాల్లో మార్పు తెచ్చేలా కేటాయింపులు
- విద్యారంగం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
- మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు
- అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమన్యాయం
- పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రశంసలు
- సీఎం చంద్రబాబుకు, పయ్యావులకు ధన్యవాదాలు
మంగళగిరి(చైతన్యరథం): గత పాలకుల చేతకానితనంతో కుదేలైన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఒక అద్భుతమైన ‘బ్లూప్రింట’ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి నిబద్ధతతో ఈ బడ్జెట్ను రూపొందించినందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ధన్యవా దా లు తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది కేవలం అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా వారి జీవితాల్లో మార్పు తెచ్చేలా రూపొందించిన ‘చేతల బడ్జెట’ అని కొనియాడా రు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావే శంలో మాట్లాడుతూ రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.53,915 కోట్లు కేటాయించడం ప్రభుత్వ సాహసోపే తమైన నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటల తోనే రైతులను మభ్యపెట్టిందని మండిపడ్డారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు ఊతం
కూటమి ప్రభుత్వం రైతన్నను నిజమైన రాజును చేసేందుకు వ్యవసాయం, దాని అను బంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ఐదేళ్లుగా జరిగిన నిర్లక్ష్యాన్ని వీడి, అటు మేజర్ ప్రాజెక్టులతో పాటు ఇటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేం దుకు ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ఆమె వివరించారు. పేద వాడికి సొంత ఇల్లు ఉండా లనే లక్ష్యంతో గత బడ్జెట్ (రూ.2000 కోట్లు) కంటే మూడు రెట్లు అధికంగా ఈ ఏడాది రూ.6,357 కోట్లు కేటాయించడం గర్వకారణమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా రూ.91,000 కోట్లు కేటా యించాం. సాధారణ సంక్షేమ పథకాలకు గత ఏడాది రూ. 41,000 కోట్లు ఉంటే ఈసారి దాన్ని రూ.53,000 కోట్లకు పెంచ డం మా ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు
భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను యువ నాయకులు నారా లోకేష్ భుజానికెత్తు కున్నారని ప్రశంసించారు. పాఠశాల విద్య కోసం ఏకంగా రూ.32,308 కోట్లు కేటాయించడం ద్వారా విద్యారంగానికి మా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థ మవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని విమర్శిం చారు. మన యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జా తీయ ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించేందుకు భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్తును మార్చే ‘గోల్డెన్ బడ్జెట’ అని ఆమె అభివర్ణించారు. “గత పాలకులు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే రాష్ట్ర భవిష్యత్తు నాశన మైంది. కానీ మా ప్రభుత్వం ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు పన్ను భారం వేయకుండా, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ఈ బడ్జెట్ను సిద్ధం చేసింది. ఇది కేవలం బటన్ నొక్కే బడ్జెట్ కాదు..ప్రతి ప్రాంతానికి అభివృద్ధిని పంచే బడ్జెట్ అని కొనియాడారు.
ఉత్తరాంధ్ర అభివద్ధికి దన్నుగా…
ఉత్తరాంధ్ర వాసిగా ఆ ప్రాంతం గత ఐదేళ్లలో ఎంతగా దోపిడీకి గురైందో అందరికి తెలిసిన విషయమే..గత పాలకులు 22 మంది ఎంపీలను గెలిపించుకున్నా, స్టీల్ ప్లాంట్ను కాపాడలేక పోయారని, పైగా అమ్మకానికి సిద్ధం చేశారని విమర్శించారు. విశాఖ హక్కు అయిన రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. శ్రీకాకుళం జిల్లాకు జీవనాధారమైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ ప్రాజెక్టు లను గత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని.. ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేని అసమర్థత వారిదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార, నాగావళి నీటిని రైతులకు అందించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా పలాస, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు అందించే మహేంద్రతనయ ఆఫ్-షోర్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటా యించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిం చేందుకు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాలను ‘గ్రోత్ ఇంజన్లుగా’ గుర్తించామని ఆమె తెలిపారు. నీతి ఆయోగ్ సహకా రంతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించామని, దీని ద్వారా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 7 గ్రోత్ డ్రైవర్లను గుర్తించిందని తెలిపారు. మానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయం వంటి రంగాల్లో 41 కీలక ప్రాజెక్టులను అమలు చేయబోతున్నామని, ఇందులో మెట్రో రైలుతో సహా దాదాపు రూ.28,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు.
వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రపై కపట ప్రేమ
గత పాలకులు ఉత్తరాంధ్రపై చూపించింది కపట ప్రేమ మాత్రమే. ఋషికొండను తవ్వి, ప్రజల సొమ్ము రూ.500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ ప్రజాధనాన్ని అభివృద్ధికి వాడి ఉంటే ఉత్తరాంధ్ర ఎంతో బాగుపడేది. వైసీపీ హయాంలో విశాఖ పట్నం లాంటి ప్రశాంత నగరం ‘గంజాయి కేంద్రం’గా మారిపోయింది. చిన్న పిల్లలకు కూడా గంజాయి దొరికేలా చేసిన పాపం గత పాలకులదే” అని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ వల్ల భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగంగా జరుగు తున్నాయి. ఈ జూన్ కల్లా రన్వే సిద్ధం చేస్తామని ఇచ్చిన మాట ను నిలబెట్టుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు 136 ఎకరాల్లో ఏవియేషన్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ హబ్ను తీసుకు వస్తున్నాం. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగా లు లభిస్తాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను నివారించేం దుకు పలాస ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబో తున్నామని ప్రకటించారు. దీనివల్ల పలాస చుట్టుపక్కల అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, మన జిల్లా యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొ న్నారు. గత ప్రభుత్వ వేధింపుల వల్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సీఎల్, ఐబీఎం వంటి 14 దిగ్గజ కంపెనీలు విశాఖ వదిలి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్కు మళ్లీ పూర్వవైభవం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటోందని, 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాన్ని చేరుకోవడమే మా ధ్యేయమని స్పష్టం చేశా రు. కేవలం 20 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం అసాధ్య మైన పనులను సుసాధ్యం చేసి చూపిందని పేర్కొన్నారు. “గతంలో పారిపోయిన కంపెనీలు ఇప్పుడు మళ్లీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఎకనామిక్ సమ్మిట్లు, పెట్టుబడుల ప్రవా హం చూస్తుంటే ‘బ్రాండ్ చంద్రబాబు’పై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతోంది. యువతకు కేవలం చదువు మాత్రమే కాదు..నారా లోకేష్ ఆధ్వర్యంలో స్కిల్ డెవల ప్మెంట్ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలక హామీలను అమలు చేసింది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతన్నకు పెట్టుబడి సాయం అందించింది. దీపం 2.0 ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసింది.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించే గొప్ప అడుగు ముందుకేసింది. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. బడ్జెట్పై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. “మీరు బూతులు మాట్లాడకుండా కేవలం సబ్జెక్ట్ మీద మాట్లాడ తామంటే చర్చకు మేం సిద్ధం. మీ ఐదేళ్ల అస్తవ్యస్త పాలన పక్కన పెట్టి మా 20 నెలల అభివృద్ధిని చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. “సాక్షి లాంటి పత్రికలను, ఛానళ్లను అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజాలుగా నమ్మించాలని చూస్తే ప్రజలు నమ్మరు. ప్రజల కలలకు, ఆశలకు ప్రతిరూపమే ఈ 2026-27 బడ్జెట్. రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి.. ఇలా అన్ని ప్రాంతాల కు, అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా ఈ బడ్జెట్ రూపొందిం చాం. ప్రజలందరూ ఒకసారి బడ్జెట్ వివరాలను చదివి వాస్తవా లను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తోందని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష ధీమా వ్యక్తం చేశారు.















