- ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు
- విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ నగరాన్ని భే సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖ ఎకనామిక్ రీజియన్పై తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతోసమీక్షించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగా పురం వరకు బే సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. వీఈఆర్పై ఓ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. గ్రేహౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించా లని ఆదేశించారు. కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మి కంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా బీచ్ వాటర్ స్పోర్ట్స్ తోపాటు వినోదం కలిగించే వివిధ ప్రాజెక్టులు చేపట్టేలా పెట్టుబడులు ఆహ్వానించాలన్నా రు. విశాఖలోని జంతు ప్రదర్శనశాలను కూడా ఆధునికీకరించి పర్యాటకుల్ని ఆకర్షించేలా చూడాలని సూచించారు.
విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయాలన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు లాంటి పర్యాటక ప్రాంతాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయ న్నారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకుని ఏర్పాటు చేసే టౌన్షిప్ల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నీతి ఆయోగ్ సమర్పించిన వీఈఆర్ ప్రాజెక్టు నివేదికను ప్రజల్లో చర్చకు ఉంచాలని… విద్యార్థులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకు తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, వీఈఆర్ కన్వీనర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరబ్ గౌర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు.














