- నేడు కుటుంబసమేతంగా సంక్రాంతి సంబరాలు
- అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- నాలుగురోజుల పాటు స్వగ్రామంలోనే మకాం
అమరావతి(చైతన్యరథం): సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లారు. ఏటా కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు ఈ ఏడాది కూడా స్వగ్రామంలోనే పండుగ జరుపు కోనున్నారు. సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో సమీక్ష అనంతరం సాయంత్రం నారా వారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి మంగళవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. నారావారిపల్లెతోపాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించడంతోపాటు.. శంకుస్థాపనలు చేస్తారు.
ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
నారావారిపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వరస్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట-భీమ వరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారం భిస్తారు. నారావారి పల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలోపేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మూలపల్లి లో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యాము, మూలపల్లి చెరువుతోపాటు మరో 4 చెరు వులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షల తో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వీ యూనివర్సిటీ లో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాట్స్, విద్యా మౌలికవసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు కు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
నాగాలమ్మకు ప్రత్యేక పూజలు
గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి 15వ తేదీన కుటుంబ సమేతంగా వెళ తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. అదేరోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.














