- మండల, క్లస్టర్ స్థాయి నేతలకూ
- పొలిట్బ్యూరోలో స్థానంతో సంచలనం
- కమిటీల్లో మహిళలకు పెద్దపీట
- విధేయత, నిబద్ధతకు పట్టం
- బడుగులకు 66 శాతం మేర పదవులు
- భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కూర్పు
అమరావతి(చైతన్యరథం): టీమ్ 2029ను టీడీపీ అధినాయ కత్వం సిద్ధం చేసింది. తెలుగుదేశం పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి గతానికి భిన్నంగా వ్యవహరించారు. కసరత్తును కొత్త పుంతలు తొక్కించారు. భవిష్యత్తులో పార్టీకి అవసరమైన సైన్యాన్ని సిద్ధం చేసుకునే దిశగా చంద్రబాబు కమిటీల నియామకంపై ఎక్సర్సైజ్ చేశారు. ముందు నుంచి చెబుతున్న విధంగా విధేయతకు.. పని తీరుకు పెద్దపీట వేశారు. ఓ మండలాధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్చార్జికి ఏకంగా పొలిట్బ్యూరోలో స్థానం కల్పించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే ఏ విధంగా అందలమెక్కిస్తుందనే దాని కి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం నిదర్శనం. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేశారు. టీడీపీ అధినేత చేపట్టిన కసరత్తులో యువత, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం నియామకాల ప్రకటనగా కాకుండా, భవిష్యత్ రాజకీయ వ్యూహానికి బలమైన పునాది వేసేలా ముఖ్య మంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు. స్వయంగా అన్ని సమీకర ణాలను సూక్ష్మంగా విశ్లేషిస్తూ, రోజువారీ కసరత్తుతో ఈ కమిటీ లను రూపొందించారు.
లోకేష్కు బాధ్యతలు..శ్రేణుల్లో జోష్
తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వాన్ని అందించే అంశంపై ఫోకస్ పెట్టి చంద్రబాబు ఈ కసరత్తు చేశారు. తన పాదయాత్రతో కేడర్, లీడర్లల్లో మంచి జోష్ నింపిన నారా లోకేష్కు కీలక బాధ్య తలు అప్పగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి పాల నలోనూ, పార్టీ వ్యవస్థలోనూ ఆయన పాత్రను మరింత బలపరిచా రు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణను వేగ వంతం చేసేలా ఈ కూర్పు ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగు తోంది. లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు.. కమిటీల్లోనూ యువతకు పెద్దపీట వేశారు. ఓ పక్క యువతకు పెద్దపీట వేస్తూనే మరోవైపు సీనియర్లకు సముచిత స్థానం కల్పించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ను కొనసా గించారు. మొత్తం 26 మందితో పొలిట్బ్యూరోను ఏర్పాటు చేశా రు. ముగ్గురు సభ్యులు పొలిట్బ్యూరోకు ఎక్స్ ఆఫిషియో సభ్యులు గా హాజరవుతారు. ఇక 32 మందితో జాతీయ కమిటీ, 189 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు ద్వారా సమగ్రత, సమతుల్యతకు పెద్దపీట వేశారు. సమర్థవంతంగా పనిచేసే మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పెద్దపీట వేశారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షు రాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్చార్జ్ గుత్తికొండ ధనుంజయ్లను నేరుగా పొలిట్బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా వారి పార్టీ కోసం పని చేసిన వారికి, పార్టీ విధేయులుగా ఉన్న వారికి పెద్దపీట వేసినట్టు అయింది.
బడుగులు, మహిళలు, యువతకే ప్రాధాన్యం
మహిళలకు ఈసారి ఇచ్చిన ప్రాధాన్యత చారిత్రాత్మకమే. రాష్ట్ర కమిటీలో 189 మందిలో 51 మంది మహిళలకు స్థానం కల్పించారు. అలాగే పొలిట్బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ వారి కి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా 33 శాతం మహిళా రిజర్వేషన్ల దిశగా ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకునేలా చంద్రబాబు కసరత్తు సాగింది. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత విషయం లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2024 ఎన్నికల నుంచి అన్ని రకాలుగా బేరీజు వేసుకుని సోషల్ రీ-ఇంజనీరింగ్ చేస్తూ ఏ విధంగా అయితే టిక్కెట్లు ఇచ్చారో.. ఇప్పుడూ అదేస్థాయిలో కసరత్తు చేశారు. రాష్ట్ర కమిటీలో మొత్తంగా 189 మంది ఉంటే బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ వర్గాలకు చెందిన 122 మందికి కమిటీలో చోటు కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మెజార్టీ పదవులు కేటాయించ డంలో దామాషా పద్ధతిని చంద్రబాబు అనుసరించారు. కమిటీ లో 78 మంది బీసీలకు, 25 మంది ఎస్సీలకు, 7 మంది ఎస్టీలకు, 13 మంది మైనార్టీలకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పిం చారు. ఈ లెక్కలను బట్టి బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాతం చొప్పు న కమిటీలో స్థానం కల్పించినట్లయింది.
డీలిమిటేషన్ మార్పులకు అనుగుణంగా కసరత్తు
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ కమిటీల కూర్పు చేపట్టారు. డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతమున్న 175 సీట్లు… సుమారు 263 అవుతాయి. చాలా మంది యువతకు అవకాశాలు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అలాగే మహిళ రిజర్వేషన్లు కూడా అమల్లోకి రానున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కమిటీల కూర్పు సాగింది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేడర్ సమావే శాల్లో ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కమిటీ కూర్పులోనూ దీనికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా పదవులు దక్కని వారికి అనుబంధ సంఘాల్లో అవకాశాలు కల్పించనున్న ట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద, ఈ కమిటీల కూర్పు, పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం, మహిళా సాధికా రత, యువతకు ప్రోత్సాహంతో పాటు భవిష్యత్ రాజకీయ లక్ష్యాల సాధనకు రూపొందించిన సమగ్ర ప్రణాళికగా ఉందనే భావన వ్యక్తమవుతోంది.














