- ఇంటర్లో 12 ఏళ్ల తర్వాత రికార్డ్
- ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత
- ఫస్టియర్ 77, సెకండియర్ 81 శాతం
- విద్యాశాఖలో సంస్కరణలతో ఉత్తమ ఫలితాలు
- విద్యార్థులకు సీఎం చంద్రబాబు, లోకేష్ అభినందనలు
అమరావతి(చైతన్యరథం): విద్యాశాఖ సాధించిన విజయాల కంటే వివాదాలే ఎక్కువ అని పేరుపడింది. విద్యాశాఖ ఎవరు తీసుకున్నా సవాలే అన్నట్లు ఉండేది. కష్టం అంటే ఇష్టంగా భావించి నేర్పు-ఓర్పుతో అధిగమించే చాలెంజ్ కింగ్ నారా లోకేష్ విద్యాశాఖను చేపట్టి ఆ సవాల్ను స్వీకరించారు. విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించారు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రణాళికాబద్ధంగా విద్యావ్యవస్థను గాడిలో పెట్టారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంటర్ ఫలితాల రూపంలో కనిపించింది. బుధవారం ఇంటర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్న డూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. జూని యర్ ఇంటర్ పరీక్షలకు 5,10,307 మంది, సీనియర్ ఇంటర్కు 5,05,609 మంది మొత్తం 10,15,916 మంది హాజ రయ్యారు. మొదటి సంవత్సరంలో 77% మంది ఉత్తీర్ణత సాధించగా ఇది గత 12 ఏళ్లలో అత్యధికం. రెండవ సంవత్సరం 81 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం. ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థల్లో మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి. రెండవ సంవత్సరం 76% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి.
సంక్షేమం..సంస్కరణలు
ఇప్పటివరకూ హైస్కూలు విద్యార్థులకే అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంను ఇంటర్ విద్యార్థులకూ అమలు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యా ర్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్, సైన్స్ ప్రాక్టికల్ రికార్డులు/మాన్యువల్స్ను పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేసి బోధనకు అంతరా యం లేకుండా చూశారు.
ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ
జూనియర్ కాలేజీ విద్యార్థులకు పకడ్బందీగా యూనిట్ టెస్టు లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ-ఫైనల్ పరీక్షలను కేంద్రీకృత పద్ధతి లో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డ్యాష్బోర్డ్ల ద్వారా నిరంత రం పర్యవేక్షిస్తూ, విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్ల పనితీరు ను ప్రతి నెలా సమీక్షించారు. కళాశాల పని వేళలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మార్చారు.
‘సంకల్పం 2026’తో 50 రోజుల విజయ ప్రణాళిక
విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో ఇంకా మెరుగు కావాలో గుర్తించి ఆ దిశగా శిక్షణ అందించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ను రూపొందించి పంపిణీ చేశారు.
కేర్ టేకర్ వ్యవస్థతో సత్ఫలితాలు
కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి హాజరు, ఫలితాల బాధ్యతను స్వీకరించారు. విద్యార్థుల సంక్షేమం చూస్తూనే ఇందు లో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపొందించారు. జూనియర్ కాలేజీల్లో ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించి.. పిల్లల ప్రగతిని వివరించే ప్రోగ్రెస్ కార్డులను అందజే శారు. డిజిటల్ కనెక్టివిటీతో సత్ఫలితాలు సాధించారు. సిలబస్ పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి క్లాస్ వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త ప్రశ్నపత్రం విధానం ప్రవేశపెట్టడం వల్ల వారు అన్ని సబ్జెక్టులలో అత్యధిక స్కోరు సాధించడానికి మంచి అవకాశం ఏర్పడింది. విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్ పట్టుదల, కృషితో ఇంటర్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అధికారులు, నిపుణుల సూచనలు-సలహాలతో రూపొందించిన ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసిన లోకేష్ నిరంతరం పర్యవేక్షించారు. లక్ష్యానికి చేరుకున్నారు. ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించారు.
పూలే బీసీ గురుకుల విద్యార్థుల సత్తా
ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇంటర్లో 97 శాతం, సెకండ్ ఇంటర్లో 94 శాతంతో బీసీ బిడ్డలు ఉత్తీర్ణులయ్యారు. జూనియర్ బైపీసీ, ఎంపీసీలో స్టేట్ మొదటి రెండు ర్యాంకులు, సీఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు సాధిం చడం విశేషం. జూనియర్ ఇంటర్లో మూడు ఎంజేపీ గురు కులాలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించగా, సీనియర్ ఇంటర్లో ఏడు గురుకులాల వంద శాతం మేర ఫలితాలు సాధించాయి. వాటిలో మూడు గురుకులాలు సీనియన్, జూనియర్ ఇంటర్లో వంద శాతం ఫలితాలు రాబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని రకాల విద్యా సంస్థల్లో ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్లో ఎంజేపీ గురుకుల విద్యార్థులు 97 శాతంతో మొదటి వరుసలో నిలిచారు. సీనియర్ ఇంటర్లో 94 శాతంతో రెండో స్థానంలో నిలిచి ఔరా అనిపించుకున్నారు.
చంద్రబాబు, లోకేష్ లక్ష్యం నెరవేరింది: మంత్రి సవిత
ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకుల విద్యార్థులు సత్తా చాట డంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఇంటర్లో 97 శాతం, సెకండ్ ఇంటర్లో 94 శాతం ఫలితాలు సాధిం చినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 90 శాతానికి పైగా ఫలితాలు సాధిస్తూ బీసీ బిడ్డలు సీఎం చంద్రబా బు, మంత్రి నారా లోకేష్ లక్ష్యాన్ని నెరవేర్చారని తెలిపారు.















