- నెటైరో విధానాన్ని అమలు ” చేస్తున్న ఇళ్ల పరిశీలన
కుప్పం (చైతన్యరథం); నెట్ జీరో విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. కుప్పం పర్యటనలో రెండో రోజైన శనివారం సలగంపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్లను సీఎం సందర్శించారు. సోలార్ రూఫ్ టాప్ సోలార్, ఇండక్షన్ కుక్టాప్లు, వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలను పరిశీలించారు. నలగంపల్లి నమూ నాను కేస్ స్టడీగా తీసుకుని కుప్పం వ్యాప్తంగా నెటీ జీరో విధానా న్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
సర్క్యులర్ ఎకానమీ గ్రామస్థాయిలో అమలు
నలగంపల్లిలో ఓ ఇంటిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ ప్యానెళ్ల సంఖ్య, విద్యుత్ ఉత్పత్తి, ఇంటి అవసరాలకు సరిపోతుందా అనే విషయాలను అడిగి తెలుసుకు న్నారు. సోలార్ విద్యుత్తో ఇండక్షన్ స్టవ్లను ఉపయోగిస్తూ నెలకు సుమారు రూ.400 వరకు ఆదా చేస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్ట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. నెట్ జీరో విధానం లో భాగంగా ఈవీ వాహనాల వినియోగం చేర్చాలని సీఎం సూచించారు. సర్క్యులర్ ఎకానమీని గ్రామస్థాయిలో అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నలగంపల్లి అనుసరిస్తున్న విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇండక్షన్తో భద్రత
ఇండక్షన్ స్టవ్లతో ప్రస్తుతం అన్ని రకాల వంటలు చేసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గ్యాస్ లీకేజీ ప్రమాదా లు తగ్గడంతో పాటు భద్రత పెరుగుతుందని గ్రామస్తులు సీఎంకు వివరించారు. కుప్పంలో రూçప్ సోలార్ వ్యవస్థ విస్తరణ ద్వారా 7,489 ລ້ 2, 2, 39,215 మంది బీసీలు, 7,381 మంది ఓసీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. ఈ విధానాన్ని కుప్పం అంతటా విస్తరించి ప్రజల విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
















