మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులతో ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ అండ్ రిలేషన్స్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా డా.పి.గురురాజా, ఇతర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు.