- దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి లోకేష్ శాశ్వత పరిష్కారం
- 3 వేల మందికి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు
- మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం
- నేటి నుంచి రెండురోజుల పాటు కార్యక్రమం
మంగళగిరి (చైతన్యరథం): ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అలవికాని వాగ్దానాలు చేసి అవసరం తీరాక మొఖం చాటేసే సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మంగళగిరి నియోజక వర్గ
పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3 వేల మందికి ఈనెల 21,22 తేదీల్లో మన ఇల్లు- మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేం దుకు రంగం సిద్ధం చేశారు. మంగళగిరి డీజీపీ ఆఫీసు సమీపం లోని సీకే కన్వెన్షన్ హాలులో రెండో విడత పట్టాలు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటివరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకో వాలన్నా సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి.
మంగళగిరి ప్రజ లు ఎదుర్కొంటున్న ఈ జఠిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2025 ఏప్రిల్ నెలలో మంగళగిరి రత్నాల చెరువు, యర్రబాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3002 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములను ఒక్కరూపాయి ఖర్చులేకుండా అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు.
మలివిడత అందించే శాశ్వత పట్టాల వివరాలు
మలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు మూడువేల మందికి శాశ్వత పట్టాలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్స్ను మంత్రి లోకేష్ చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు. రెండోవిడతలో పంపిణీ చేయబోతున్న పట్టాల విలువ ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ప్రకారం సుమారు వెయ్యి కోట్లుగా ఉంది. మంగళగిరి గ్రామంలోని సర్వే నంబర్లు 232/1బీ1, 232/1బీ1బీ, 232/1బీసీలలో 92 12 ఎకరాలు, నవులూరు గ్రామంలోని సర్వే సంబర్ 115లో 8.46 ఎకరాల భూములు సెక్షన్ 22ఏ (1) (ఏ) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నాయి. దీనివల్ల 1,622 నివాస గృహాలు ప్రభావితమై దీర్ఘకా లంగా ఆస్తి రిజిస్ట్రేషన్పై ఆంక్షలు విధించబడ్డాయి. ఫలితంగా బదిలీ, వారసత్వం, సంక్రమణ వంటి చట్టబద్ధమైన లావాదేవీలకు ఇప్పటివరకు అవకాశం లేకుండా పోయింది. ఈ స్థలాలపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్టీవో ద్వారా ధృవీకరించిన ప్రాపర్టీ ఎంజాయ్. మెంట్ సర్టిఫికెట్లను మంత్రి లోకేష్ అందజేయనున్నారు.
స్టీల్ బ్రిడ్జ్ పట్టాలు
అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా బకింగ్హామ్ కాలుపపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలోని కె.ఎల్.రావు కాలనీలో ఆక్రమణదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. ప్రభావితమైన ఈ ఆక్రమణదారులకు పునరావాసం కల్పించేందుకు ఆత్మకూరు లేఅవుట్లో 34 ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. పంపిణీకి ప్రతిపాదించిన మొత్తం 81 స్టీల్ బ్రిడ్జ్ పట్టాలలో తాడేపల్లి మండలంలో 47, మంగళగిరి మండలంలో 34 కేసులు ఉన్నాయి.
జీవో 30 క్రమబద్ధీకరణ పట్టాలు
జీవో 30 నిబంధనల ప్రకారం మొత్తం 906 క్రమబద్ధీకరణ పట్టాలను (150 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగినవి) పంపిణీ చేయడానికి ప్రతిపాదించారు. వీటిలో 630 పట్టాలు తాడేపల్లి మండలానికి చెందినవి కాగా, 276 పట్టాలు మంగళగిరి మండలానికి సంబంధించినవి ఉన్నాయి.















