- సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వండి
- అమరావతిలో ఎన్ఎఫ్ బీ కార్యాలయం అవసరం
- డీజీఎఫ్ ద్వారా ఫిష్ మీల్ ఎగుమతి నియంత్రణ
- ఎఫ్సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించండి
- ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించండి
- ముగ్గురు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు
అమరావతి (చైతన్యరథం) జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీలు దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజని ్సంగ్ కు లేఖ రాశారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలో రొయ్యల మేత కొరతను తీర్చేందుకు, ధరల నియంత్రణకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. 2021లోనూ రొయ్యల మేత తయారీదారులకు పరిమిత స్థాయిలో దిగుమతి చేసుకునేందుకు అనుమతులిచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఈక్వెడార్ నుంచి పెరిగిన రొయ్యల ఉత్పత్తి, ఎగుమ తుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ ఉత్పత్తులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయన్నారు.
అమెరికా, చైనా, యూరోప్ లాంటి ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు. తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నాయని తన లేఖలో వివరించారు. జన్యుమార్పిడి చేసిన సోయాబీనన్ను వ్యవసాయానికి, విత్తన ఉత్ప త్తికి వినియోగించే అవకాశం లేదని తద్వారా జీవ వైవిధ్యానికి దేశీయ వంగడాలకు ముప్పు లేదని వివరించారు. ప్రభుత్వం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇస్తే రొయ్యల మేత పరిశ్రమకు నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. లక్షలాది మంది రొయ్యల రైతులు, కార్మికులకు ఉపాధి కలుగుతుందని, తద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని తెలిపారు.
బ్లూ ఎకానమీకి సహకారం ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయటంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీ య మత్వ అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం మరో లేఖలో మంత్రిని కోరారు. ఈ ఏడాది జూన్ 5 తేదీన విశాఖలో జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో అమరావతిలో ఎన్ఎఫ్ఎబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు అమరావతి లోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ఎఫ్ఎ ప్రాంతీయ కార్యాలయం, శిక్షణ కేంద్రం, పార్క్ ప్రజల సందర్శనార్థం ఆక్వేరియం ఏర్పాటు కోసం కేటాయించా మన్నారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. 2028 నాటికల్లా ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణా కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుం దని వివరించారు..
వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్కు లేఖ
ఆంధ్రప్రదేశ్లోని అక్వా కల్చర్ రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయలకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈక్వెడార్ నుంచి అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలకు ఎగుమతులు పెరగ టంతో అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమ బద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రొయ్యల ఫీడ్లో ఉపయోగించే చేప పొడిని 5 శాతం ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా దేశీయ ఫీడ్ తయారీదారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. డీజీఎఫ్ ద్వారా ఎగుమతులను నియంత్రించా లని కోరారు. దేశీయ రొయ్యల ఫీడ్ తయారీదారుల అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులకు అనుమతించాలని కోరారు. జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింపజేయాలి
ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. లక్షలాది మంది రైతు కుటుంబాలకు ఉపా ధి కల్పిస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు దోహద పడుతోందని వెల్లడించారు. దేశంలోని పొగాకు ఉత్పత్తిలో ఎఫ్సీవీ పొగాకు 70 శాతం మేర ఎగుమతి అవుతోందని వెల్లడిం చారు. జింబాబ్వే టాంజానియా లాంటి దేశాల్లోని ఎగుమతి దారులకు ఆయా దేశాలు రాయితీలు, సుంకాల మినహాయింపు ఇస్తున్నాయని తెలిపారు. భారతీయ పొగాకు ఎగుమతిదారులకు ఎలాంటి మద్దతు లేకపోవటంతో తీవ్రమైన పోటీ. ఎదుర్కొంటు న్నారని తెలిపారు. ఆగస్టు 2021లో రోడ్ప్ పథకం కింద టీ, కాఫీ, మసాలా దినుసులు లాంటి వ్యవసాయ వస్తువులను చేర్చిన ప్పటికీ ప్రాసెస్ చేయని పొగాకును (హెచ్ఎస్ కోడ్ 2401) మాత్రం ఈ జాబితాలో చేర్చలేదన్నారు. సమాన వడ్డీ పథకం, నిర్యాత్ ప్రోత్సాహన్ లాంటి పథకాల కింద ఎఫ్సీవీ పొగాకుకు సబ్సిడీ లేకపోవటంతో ఎగుమతిదారులకు భారం పడుతోందని సీఎం వివరించారు. తక్షణమే ప్రాసెస్ చేయని పొగాకు (హెచ్ఎస్ కోడ్ 2401-2401 10, 2401 20, 2401 30) రకాలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు రోడ్ప్ పథకం కింద ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరారు.
కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల టాప్ అప్ ఇవ్వండి
ఆక్వా కల్చర్ రంగాన్ని అదుకునేలా ఆక్వా కల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్న మరో లేఖలో కోరారు. భారత- అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆక్వా దిగుమతులపై సుంకం 10 శాతానికి తగ్గినా ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోందని, టారిఫ్ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల వరకూ వన్ టైమ్ టాప్ అప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెటింగ్ కోసం ఎన్ఎఫ్బీ ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయాలని కోరారు. విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించేందుకు రొయ్య ఎగుమతులను పెంచేలా సబ్సీడీలు ఇవ్వ టంతో పాటు సామర్ధ్యాలను పెంచేలా చూడాలని లేఖలో పేర్కొన్నా రు. అలాగే ప్రాసెస్ చేయని పొగాకు హెచ్ఎస్ఎన్ కోడ్ 2401 పై జీఎస్టీని 40 నుంచి 28 శాతానికి తగ్గించాలని కోరారు. ఏపీలోని లక్షలాది మంది పొగాకు రైతులతో పాటు డీలర్లు, ఎక్స్ పోర్టర్లకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ పెంపు వల్ల వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తలెత్తి సకా లంలో రైతులకు చెల్లింపులు చేయటంలో ఇబ్బందులు తలెత్తుతు న్నాయని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఆర్థిక లావాదేవీలు మెరుగవుతాయని స్పష్టం చేశారు. రూపాలతో ఘనస్వాగతం పలకాలని తెలిపారు. ఆగస్టు 1న విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు.. జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీతో పాటు జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ లాంఛనంగా అవిష్కరి స్తారని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మణిహారంగా నిలవ నున్న ఈ విమానాశ్రయం లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక గేమ్ చేంజర్లా మారుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర అంతటా వేడుకగా ప్రారంభోత్సవం
ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు ప్రారంభో త్సవం సందర్భంగా బహిరంగ సభను నిర్వహించాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో పాటు పటిష్ట బందో బస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే వారి కోసం అల్పాహారం, భోజనం, తాగునీటి లాంటి సదుపాయాలు కల్పించా లన్నారు. మంగళవారం నుంచి జూలై 31 వరకూ అల్లూరి సీతా రామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. రానున్న 10 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రతి ఇంటా ఈ ప్రారంభోత్సవ వేడుక స్ఫూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న అరకు కాఫీ బ్రాండింగ్ కూడా వేదికగా దీనిని మలచాలని సూచించారు. మంగళవారం నుంచి చేపట్టే కార్యక్రమాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా హాజరుకావాలని నిర్దేశించారు. ఈ సమీక్షకు హోం మంత్రి అనిత, సీఎస్ సాయిప్రసాద్, ఐఅండ్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని వాసరావు, సివిల్ ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు హాజరయ్యారు.















